IND vs AUS: మా ఆటను చూస్తే గర్వంగా ఉంది: హార్దిక్ పాండ్య
ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో (IND vs AUS) పోరాడి మరీ టీమ్ఇండియా విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో (IND vs AUS) ఆసీస్పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ సన్నాహక సిరీస్గా భావిస్తున్నక్రమంలో టీమ్ఇండియా (Team India) సమష్ఠి కృషితో గెలిచింది. బౌలింగ్కు అనుకూలంగా మారిన పిచ్పై తొలుత భారత బౌలర్లు అదరగొట్టారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ బ్యాటింగ్కు కఠినంగా మారింది. అయినా సరే ఎంతో ఓర్పుగా ఆడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఆరో వికెట్కు ఏకంగా 108 పరుగులను జోడించారు. ఈ సందర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టు ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘‘తొలి వన్డేలో ఆసీస్ను ఓడించడం ఆనందంగా ఉంది. దానికోసం జట్టు సమష్ఠిగా ఆడిన తీరు గర్వకారణం. దాదాపు ఎనిమిది నెలల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతున్న రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్లోనూ రాణించడం సూపర్. మ్యాచ్ను ఇలా ముగించడం చాలా బాగుంది. ఇదే క్రమంలో జడ్డూతో కలిసి సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ నిర్మించిన భాగస్వామ్యం మ్యాచ్కే హైలైట్. మైదానం వెలుపల నుంచి చూస్తూ.. వారిద్దరూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ముగించిన తీరు ముచ్చటేసింది. మేం బౌలింగ్, బ్యాటింగ్ చేసేటప్పుడూ ఒత్తిడికి గురయ్యాం. అయితే, ఆ ఒత్తిడిని అధిగమించి మరీ ఫలితం సాధించాం. ఒక్కసారి పరిస్థితులు మన అదుపులోకి వస్తే చాలు అన్నీ మారిపోతాయి’’ అని హార్దిక్ తెలిపాడు.
ఎనిమిది నెలల తర్వాత ఆడటంపై జడేజా
‘‘దాదాపు ఎనిమిది నెలల తర్వాత వన్డే ఆడా. వీలైనంత త్వరగా ఈ ఫార్మాట్కు అలవాటుపడాలని భావించా. అదృష్టవశాత్తూ తొలుత బౌలింగ్లో రెండు వికెట్లు దక్కాయి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే నేను కేవలం కేఎల్తో భాగస్వామ్యం నిర్మించాలని మాత్రమే భావించా. మొన్నటి వరకు టెస్టు క్రికెట్ ఆడాం. అక్కడి లైన్ అండ్ లెంగ్త్కు .. వన్డే ఫార్మాట్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకే వేగంతో బంతులను సంధించకూడదు. అందుకే, సరైన ప్రాంతంలో బంతిని వేసేందుకు ప్రయత్నించా. అందులోనూ కాస్త టర్నింగ్ లభించింది’’ అని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న జడేజా (Ravindra Jadeja) తెలిపాడు. నిన్న అందుకొన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో కొత్త మైలురాయిని చేరుకొన్నాడు. ఆసీస్పై అత్యధికంగా ఈ అవార్డులను అందుకొన్న సచిన్ (17), కోహ్లీ (9) తర్వాత రోహిత్(6), యువరాజ్(6)లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు.
అంచనా వేయలేదు: స్మిత్
‘‘మేం అంచనా వేసినట్లు పిచ్ లేదు. భారత బౌలర్లు చాలా చక్కగా రాణించారు. కొన్ని కీలక అంశాలను వదిలేశామని అనిపిస్తోంది. కనీసం 250 పరుగులు చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. మిచెల్ మార్ష్ చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. తొలుత మా ఇన్నింగ్స్ దూకుడు ఉంది. అయితే, మిడిలార్డర్లో వికెట్లను కోల్పోవడంతో వెనుకబడిపోయాం. ఉత్తమ భాగస్వామ్యాలను నిర్మించలేదు. లక్ష్య ఛేదనలో జడేజా - రాహుల్ మంచి భాగస్వామ్యం నిర్మించి చూపించారు. పేస్ బౌలింగ్కు పిచ్ నుంచి సహకారం లభించింది. బంతి చాలా బాగా స్వింగ్ అయింది. తొలుత మేం మరిన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని కచ్చితంగా చెప్పగలను. అన్ని విభాగాల్లో రాణించిన భారత్కే ఈ క్రెడిట్ దక్కుతుంది’’ అని స్మిత్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?