IND vs NZ: సమష్టి కృషికి ఫలితమిది.. భారత్‌ విజయంపై దిగ్గజ క్రికెటర్ల స్పందన

ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0..

Updated : 06 Dec 2021 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0 తేడాతో కైవసం చేసుకున్నట్లయింది. పరుగుల పరంగా టెస్టుల్లో టీమ్‌ఇండియాకిదే భారీ విజయం కావడం గమనార్హం. భారత్ ఘన విజయంపై పలువురు క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. మాజీ దిగ్గజ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌,  వీవీఎస్‌ లక్ష్మణ్ సహా రిషభ్‌ పంత్‌, కుల్‌దీప్ యాదవ్‌ లాంటి పలువురు యువ ఆటగాళ్లు టీమ్‌ఇండియా విజయంపై సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. భారత జట్టు సమష్టి కృషికి ఫలితం దక్కిందని ప్రశంసించారు.

Read latest Sports News and Telugu News








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని