పంత్, సుందర్, అక్షర్.. టీ20ల్లో ఉంటారా?
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది...
బలంగా ఉన్న టీమ్ఇండియా రిజర్వ్బెంచ్..
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది. మిగతా మూడు టెస్టుల్లోనూ ఘన విజయాలు సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించిన ఆటగాళ్లలో ముగ్గురు యువ క్రికెటర్లు కీలకంగా ఉన్నారు. వారే.. రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్పటేల్. ఈ ముగ్గురూ పొట్టి సిరీస్కు సైతం ఎంపికైన నేపథ్యంలో తుది జట్టులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ సిరీస్కోసం ఎంపిక చేసిన జాబితాలో టీమ్ఇండియా ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరి రాబోయే సిరీస్లో వీరికి అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.
పంత్కు పోటీగా అతడే..
ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లతో పంత్ ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. టెస్టు మ్యాచ్ల్లోనే వన్డే, టీ20 ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ను మెరుగు పర్చుకొని భారత్కు అపురూప విజయాలు అందిస్తున్నాడు. అలాంటి బ్యాట్స్మన్ టీ20 సిరీస్లో తుది జట్టులో ఉంటాడా లేదా అనేది తెలియదు. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో అతడికి దీటుగా ఆడే ఆటగాడు కేఎల్ రాహుల్. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. అలాగే కీపింగ్లోనూ గత పరిమిత ఓవర్ల సిరీస్ల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇషాన్ కిషన్ అనే ముంబయి ఇండియన్స్ కీపర్, బ్యాట్స్మన్ పొట్టి సిరీస్కు ఎంపికయ్యాడు. అతడిని రెండో కీపర్గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్, బ్యాట్స్మన్ స్థానంలో పంత్ ఉంటాడో లేదో తెలియదు. అయితే, ఇటీవల అతడు ఫామ్ అందుకున్న తీరు చూస్తుంటే కచ్చితంగా తుది జట్టులో ఉంటాడనిపిస్తోంది.
వాషింగ్టన్కూ ఉన్నారు..
వాషింగ్టన్ సుందర్ సైతం గత రెండు టెస్టు సిరీస్ల్లో బాగా రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20ల్లోనూ ఆడిన అతడు ముఖ్యంగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్ ఠాకుర్(67)తో కలిసి సుందర్(62) తొలి ఇన్నింగ్స్లో కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆ మ్యాచ్పై టీమ్ఇండియా పట్టు సాధించడంలో తన వంతు పాత్రపోషించాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్తో సిరీస్లోనూ తొలి మ్యాచ్లో వాషింగ్టన్ 85* పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే నాలుగో టెస్టులో 96* విశేషంగా బ్యాటింగ్ చేశాడు. అలా లోయర్ మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధిస్తూ కీలకంగా కొనసాగుతున్నాడు. అయితే, పొట్టి క్రికెట్లో అవకాశం రావాలంటే వాషింగ్టన్కు కూడా గట్టి పోటీ ఉంది. అతడు ఆల్రౌండర్ కావడంతో ఈ జాబితాలో హార్దిక్ పాండ్య ఇప్పటికే నంబర్వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు స్పిన్ విభాగంలో యుజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియా ఎంపికయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ను తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
అక్షర్కు మెరుగైన అవకాశాలు..
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ మూడు మ్యాచ్ల్లోనే 27 వికెట్లు సాధించి శేభాష్ అనిపించుకున్నాడు. చెన్నై పిచ్పై రెండో టెస్టులో ఏడు వికెట్లు సాధించిన అతడు తర్వాత మొతేరాలో వికెట్ల జాతర చేసుకున్నాడు. మూడో టెస్టులో కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/38, 5/32) చేశాడు. ఇక చివరి టెస్టులో మరో 9 వికెట్లతో సత్తా చాటడంతో పాటు బ్యాటింగ్లోనూ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. కాగా, టీ20 సిరీస్ సైతం అదే పిచ్పై జరుగుతున్న నేపథ్యంలో అక్షర్కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇతర స్పిన్నర్ల నుంచి పోటీ ఎదురైనా అది చాహల్ నుంచి మాత్రమే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పొట్టి సిరీస్లో ఎవరుంటారో లేదో వేచి చూడాలి.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం