నవ్వుతూ తిరిగొస్తానని మాటిచ్చా: సూర్యకుమార్
టీమిండియాలో చోటు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇంగ్లాండ్తో జరగనున్న అయిదు టీ20ల సిరీస్కు
ఇంటర్నెట్డెస్క్: టీమిండియాలో చోటు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇంగ్లాండ్తో జరగనున్న అయిదు టీ20ల సిరీస్కు సూర్య ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ జాతీయమీడియాతో మాట్లాడాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్ల నుంచి మెళకువలు నేర్చుకుంటానని పేర్కొన్నాడు.
‘‘టీమిండియాకు ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆ శుభవార్త విన్న తర్వాత నా క్రికెట్ ప్రయాణం ఒక్కసారిగా గుర్తొచ్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో కంటున్న కల ఇది. ప్రస్తుతం ఆట పరంగా ఉత్తమంగా ఉన్నానని భావిస్తున్నా. ఏ మేరకు ప్రాక్టీస్ చేయాలో, ఎంత విశ్రాంతి తీసుకోవాలనే అంశాలపై అవగాహన ఉంది. భారత జట్టుకు విజయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. కోహ్లీ, రోహిత్ నుంచి ఆటలో మరింత నైపుణ్యం నేర్చుకుంటా. వారి నుంచే కాదు, భారత ఆటగాళ్లందరి సాయంతో సాధ్యమైనంత వరకు నా ఆటను మెరుగుపర్చుకుంటా’’ అని సూర్యకుమార్ అన్నాడు.
‘‘ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై ఎంతో నిరాశ చెందా. అయితే కుటుంబంతో పాటు ముంబయి ఆటగాళ్లందరూ నాకు ధైర్యం చెప్పారు. శ్రమిస్తూనే ఉండమని, సమయం వచ్చినప్పుడు తప్పక అవకాశం వస్తుందన్నారు. ఆ తర్వాత నా భార్యతో.. ఒంటరిగా బీచ్కు వెళ్తానని, తిరిగివచ్చేప్పుడు నవ్వుతూ తిరిగొస్తానని చెప్పా. బయోబబుల్, ఎంపిక కాకపోవడం వంటి ఆ పరిస్థితుల్లో నా సతీమణి నాతో ఉండటం అదృష్టమే. ఇక ఆ సమయంలో మా జట్టుకు కీలక మ్యాచ్లు ఉన్నాయి. మానసికంగా సన్నద్ధమై మంచి ప్రదర్శన చేశా’’ అని సూర్య తెలిపాడు.
గత ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ టైటిల్ సాధించడంలో సూర్య కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్ల్లో 40 సగటు, 145 స్ట్రైక్రేట్తో 480 పరుగులు సాధించాడు. అయితే అతడు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా, మార్చి 12న భారత్×ఇంగ్లాండ్ టీ20 సిరీస్ను ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక