ICC Awards: ఐసీసీ అవార్డుల ప్రకటన.. ‘ప్లేయర్ ఆఫ్ ది అక్టోబర్ మంత్’ వీరే!
వరల్డ్ కప్ (ODI World Cup 2023) జరుగుతున్న వేళ ‘ప్లేయర్ ఆఫ్ ది అక్టోబర్ మంత్’ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. భారత స్టార్ పేసర్ బుమ్రా రేసులో నిలిచినా.. కివీస్కు చెందిన ఓ యువ ఆల్రౌండర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి నెలా అత్యుత్తమ ప్రతిభను చూపిన పురుష, మహిళా క్రికెటర్లకు ఐసీసీ (ICC) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులను ఇస్తుంది. అక్టోబర్ నెలకు సంబంధించి పురుష, మహిళా క్రికెటర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్లో ఈ అవార్డు కోసం ముగ్గురు రేసులో ఉండగా.. అందులో టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రా కూడా ఉండటం విశేషం. కానీ, ప్రపంచకప్లో యువ సంచలనం, కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఈ అవార్డు వరించింది. ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది. బుమ్రాతోపాటు దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్తో పోటీ పడి మరీ రచిన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా 25 ఏళ్ల వయసులోపు ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన యువ బ్యాటర్గా రచిన్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ను అధిగమించాడు.
రచిన్ రవీంద్ర (Rachin Ravindra) ఈ వరల్డ్ కప్లో అక్టోబర్ నెలలో కివీస్ ఆడిన మ్యాచుల్లో ఇంగ్లాండ్పై 123 పరుగులు, ఆస్ట్రేలియాపై 116 పరుగులు చేశాడు. ఆ నెలలో ఆరు మ్యాచుల్లో 81.20 సగటుతో 406 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపిక కావడంపై రచిన్ రవీంద్ర ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘గర్వంగా ఉంది. అంతేకాకుండా అక్టోబర్ నెల ఎంతో ప్రత్యేకం. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఆడటం మరింత సంతోషకరం’’ అని రచిన్ వ్యాఖ్యానించాడు. తాజాగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో మ్యాచ్ అనంతరం రచిన్ తన నానమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి సాంప్రదాయ పద్ధతిలో ఆమె దిష్టి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహిళా క్రికెటర్ హీలీ మాథ్యూస్
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ హీలీ మాథ్యూస్ను అక్టోబర్ నెల ఐసీసీ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో 99*, 132, 79 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గానూ నిలిచింది. బౌలింగ్లోనూ 3/36 ప్రదర్శనతో ఆసీస్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. టీ20 సిరీస్లో హీలీనే టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్ కావడం గమనార్హం. బంగ్లాదేశ్ స్పిన్నర్ నహిదా అక్తెర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమెలీ కెర్తో పోటీ పడి మరీ ఈ అవార్డును మాథ్యూస్ సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్