భువనేశ్వర్‌ కుమార్‌ ఇంట్లో విషాదం

టీమిండియా ఫాస్ట్‌బౌలర్‌  భువనేశ్వర్‌ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది.  లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63)  గురువారం సాయంత్రం కన్నుముశారు.

Published : 20 May 2021 21:45 IST

(photo: Bhuvneshwar Kumar Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌  భువనేశ్వర్‌ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63)  గురువారం సాయంత్రం కన్నుముశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దిల్లీ ఎయిమ్స్‌లో కిమోథెరపీ చికిత్స కూడా చేయించుకుని ఇటీవలే ఇంటికి తిరిగొచ్చారు. అనంతరం మళ్లీ ఆరోగ్యం  క్షీణించడంతో రెండు వారాల క్రితం మీరట్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు.  రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి డిశ్చార్జి చేశారు. కిరణ్‌ పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన పదవీ విరమణ పొందారు. 

కాగా, గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్న భువీ.. మనుపటి ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌, అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టులకు ప్రకటించిన జట్టులో భువీకి చోటు దక్కలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని