Smrithi Mandhana: ఆ ఓటమి తర్వాత టీమిండియా చాలా మెరుగుపడింది : స్మృతి మంధాన
గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఫైనల్ ఓటమి తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు చాలా మెరుగుపడిందని ఓపెనర్ స్మృతి మంధాన అన్నారు.
బ్రిస్బేన్ : గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఫైనల్ ఓటమి తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు చాలా మెరుగుపడిందని ఓపెనర్ స్మృతి మంధాన అన్నారు. రాబోయే సిరీస్ల్లో ఇరుజట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని ఆమె తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, ఓ టెస్టు మ్యాచులో తలపడనున్నాయి. చివరి సారిగా గతేడాది జరిగిన టీ20 ఫైనల్లో ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 85 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు సోమవారం క్వారంటెయిన్ పూర్తి చేసుకుంది. ఇరు జట్లు శనివారం వార్మప్ మ్యాచులో తలపడనున్నాయి.
‘టీ20 ఫైనల్ ఓటమి తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు చాలా బలంగా తయారైంది. ఆ టోర్నీ ముగిసిన వెంటనే కరోనా విజృంభించడంతో మాకు చాలా సమయం దొరికింది. దీంతో జట్టు సభ్యులంతా ఫిట్నెస్, నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం, అందరం ఒకే చోట చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టాం. రాబోయే సిరీస్ గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని మంధాన పేర్కొన్నారు.
‘ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఆ జట్టుతో పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. అక్కడి పిచ్లు కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, ప్రతి ఒక్కరు అక్కడ బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతారు. చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడుతుండటంతో సంతోషంగా ఉంది ’ అని స్మృతి మంధాన తెలిపారు. ఆస్ట్రేలియా గడ్డపై శతకం నమోదు చేసిన ఏకైన భారత మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. 2016లో జరిగిన ఓ మ్యాచులో ఆమె 102 పరుగులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!