IPL 2022: అభిమానుల ప్రేమే మాకు అమితానందం: చెన్నై సూపర్ కింగ్స్
ఎక్కడికెళ్లినా అభిమానులు ప్రేమగా చూసే చూపులే తమకు అమితానందాన్ని కలిగిస్తాయని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంటోంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్-2022 మెగా ఈవెంట్ కోసం...
సూరత్లో మొదలైన ధోనీసేన ప్రాక్టీస్
సూరత్: ఎక్కడికెళ్లినా అభిమానులు ప్రేమగా చూసే చూపులే తమకు అమితానందాన్ని కలిగిస్తాయని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంటోంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్-2022 మెగా ఈవెంట్ కోసం ఆ జట్టు ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. సూరత్లోని లాల్భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో కెప్టెన్ ధోనీతో సహా పలువురు ఆటగాళ్లు సోమవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం వద్దకు తరలివచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే ట్విటర్లో షేర్ చేసింది. అలాగే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.
కాగా, చెన్నై గతేడాది నాలుగోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2020లో ఘోర పరాభవం పాలైన ధోనీసేన 2021లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఇక ఈ సీజన్లో కొత్తగా రెండు జట్లు రాబోతున్న నేపథ్యంలో మెగా వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్లో నలుగురు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. అందులో కెప్టెన్ ధోనీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీని తమ వద్దే ఉంచుకొని మిగతా ఆటగాళ్లను వదిలేసుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ వేలంలో తమ పాత ఆటగాళ్లు అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్ లాంటి వారిని తిరిగి కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్లోనూ సగానికి పైగా ఆటగాళ్లు పాతవారే ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!