ఇంగ్లాండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక
వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది...
హార్దిక్, అక్షర్ పటేల్కు చోటు
ఇంటర్నెట్డెస్క్: వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ సారథ్యంలో 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన కోహ్లీ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయాలతో ఆసీస్ సిరీస్కు దూరమైన ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు.
కాగా, ఆసీస్ తొలి టెస్టులో విఫమలైన పృథ్వీ షాకు నిరాశే మిగిలింది. అతడు జట్టులో చోటు కోల్పోయాడు. గాయాలపాలైన హనుమ విహారి, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్కు విశ్రాంతినిచ్చారు. స్వదేశంలో ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్తో భారత్ నాలుగు టెస్టులు ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి.
జట్టు వివరాలు
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.