టీమ్ఇండియా అంటే అదే..: కేటీఆర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమ్ఇండియా డ్రా చేసుకోవడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ...
ఈ డ్రా ఇన్నింగ్స్ విజయం కన్నా బాగుంది
ఇంటర్నెట్డెస్క్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమ్ఇండియా డ్రా చేసుకోవడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యానికి నిదర్శనమని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు గాయాల బారిన పడినా, మరోవైపు జాత్యంహకార వ్యాఖ్యలు ఎదురైనా ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అద్భుత బ్యాటింగ్ చేసిన హనుమ విహారి, అశ్విన్ను మెచ్చకున్నారు. అలాగే ఈ డ్రా.. ఇన్నింగ్స్ విజయం కన్నా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన విహారి కేటీఆర్కు ధన్యవాదాలు చెప్పాడు.
టీమ్ఇండియా తొలి టెస్టులో ఘోర పరాభవం ఎదుర్కొని, రెండో టెస్టులో అద్భుత విజయం సాధించి అదే జోరులో సిడ్నీ టెస్టుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడున్నర రోజులు ఆధిపత్యం చెలాయించి దాదాపు మ్యాచ్ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నంత పని చేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం అసాధారణంగా పోరాడిన టీమ్ఇండియా మ్యాచ్ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ఇండియా ఆదివారం 98/2తో నిలిచిన సంగతి తెలిసిందే.
సోమవారం చివరిరోజు రహానె(4) విఫలమైనా పంత్(97), పుజారా(77) రాణించారు. అయితే, స్వల్ప వ్యవధిలో వారిద్దరూ ఔటయ్యాక మ్యాచ్ చేజారిపోతుందని అంతా భావించారు. కానీ, విహారి(23*; 161 బంతుల్లో 4x4), అశ్విన్(39*; 128 బంతుల్లో 7x4) పట్టుదల ప్రదర్శించారు. చివరి వరకూ క్రీజులో ఉన్నారు. 256 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేయడమే కాకుండా ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వారి ఎత్తుగడలకు సంయమనం కోల్పోకుండా ప్రశాంతంగా ఆడి మ్యాచ్ను డ్రాగా ముగించారు. దీంతో సిరీస్ 1-1తో సమానంగా ఉంది. ఈనెల 15 నుంచి బ్రిస్బేన్లో చివరి టెస్టు జరగనుంది.
ఇవీ చదవండి..
గెలుపంత డ్రా
పోరాట యోధులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం