RR vs SRH: ‘నో బాల్’.. సందీప్ శర్మ జీవితంలో మరిచిపోలేడు: మాజీ పేసర్
క్రికెట్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో ముందే అంచనా వేయడం కష్టం. గెలుపోటములు తారుమారు కావచ్చు. రాజస్థాన్ రాయల్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ (RR vs SRH) జట్ల మధ్య ఇలానే జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ సీజన్లో (IPL 2023) ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ (RR vs SRH) మ్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. విజయం సాధించామని సంబరపడిన రాజస్థాన్కు ఊహించని షాక్ తగిలింది. చివరి బంతి ‘నో బాల్’ కావడంతో ఓటమి నుంచి గట్టెక్కి మరీ హైదరాబాద్ విజయం సాధించడం విశేషం. ‘నో బాల్’ వేసి మరీ మ్యాచ్ను సన్రైజర్స్కు అప్పగించిన బౌలర్గా సందీప్ శర్మ నిలిచిపోయాడు. ఫ్రీహిట్గా వచ్చిన బంతిని హైదరాబాద్ బ్యాటర్ అబ్దుల్ సమద్ సిక్స్గా మలిచాడు. గతంలో చెన్నైపై చివరి ఓవర్లో తక్కువ పరుగులను కాపాడి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సందీప్ శర్మ.. ఈసారి మాత్రం ఆర్ఆర్ ఓడిపోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ క్రమంలో సందీప్ శర్మకు టీమ్ఇండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ భరోసా చెప్పాడు. అయితే, తన జీవితంలో మాత్రం సందీప్ ఈ నో బాల్ను మరిచిపోలేడని పేర్కొన్నాడు.
‘‘గతంలో సీఎస్కే మ్యాచ్ను పరిశీలిస్తే చివరి మూడు బంతులను అద్భుతంగా సంధించాడు. ఇప్పుడు హైదరాబాద్తోనూ అలాంటి అవకాశమే వచ్చి చేజారింది. దురదృష్టవశాత్తూ నో బాల్ పడటంతో మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా షాక్కు గురైన సందీప్ చివరి బంతిని తనదైన శైలిలో సంధించలేకపోయాడు. మ్యాచ్ ముగిసిందని సంబరపడేలోగా ‘నో బాల్’ సైరన్ మోగడంతో రాజస్థాన్ జట్టు, అభిమానులు సైలెంట్ అయిపోయారు. వారిని తీవ్రంగా బాధపెట్టింది. ఈ ఒక్కబంతిని మాత్రం సందీప్ తన జీవితం మొత్తం గుర్తు పెట్టుకుంటాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ వెనుకబడి మరీ పుంజుకోవడానికి కారణం గ్లెన్ ఫిలిప్స్. ఎలాంటి బౌలర్నైనా దూకుడుగా ఆడేయడంలో గ్లెన్ నిపుణుడు. చివరి మూడు ఓవర్లలో ఎలాంటి బ్యాటింగ్ చేయాలో గ్లెన్కు బాగా తెలుసు. తదుపరి మ్యాచుల్లోనూ గ్లెన్ వల్ల సన్రైజర్స్ బ్యాటింగ్ మరింత బలోపేతమవుతుంది’’ అని బాలాజీ తెలిపాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే మిగతా నాలుగు మ్యాచ్ల్లోనూ గెలవాలి. అప్పుడు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా చోటు దక్కే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.