Gayle-ABD : బెంగళూరు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో గేల్, ఏబీడీ
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మిస్టర్ 360 బ్యాటర్ ఏబీ డివిలియర్స్కు భారత్లో భారీ సంఖ్యలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ టీ20 లీగ్లో ఆడి ప్రేక్షకులను...
ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మిస్టర్ 360 బ్యాటర్ ఏబీ డివిలియర్స్కు భారత్లో భారీ సంఖ్యలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ టీ20 లీగ్లో ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెంగళూరు తరఫున టీ20 లీగ్లో 14వ సీజన్ వరకు ఆడిన డివిలియర్స్ ఆటకు వీడ్కోలు పలికాడు. గతంలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన క్రిస్ గేల్ను ఈసారి ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అయితే బెంగళూరు జట్టు మాత్రం వారిని తమ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో చేర్చి గౌరవించింది. ఈ మేరకు బెంగళూరు యాజమాన్యం ట్విటర్లో వీడియోను షేర్ చేసింది.
గేల్, డివిలియర్స్ను ‘హాల్ ఆఫ్ ఫేమ్’తో గౌరవించిన సందర్భంగా బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్ మాట్లాడారు. ‘‘ఏబీ తన ఆటతీరుతో గేమ్ను ఎంతో మార్చాడు. గేల్, డివిలియర్స్కు ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. ఇద్దరు ఆటగాళ్లు టీ20 లీగ్లో భారీగా ప్రభావం చూపారు’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఆన్లైన్లో పాల్గొన్న ఏబీడీ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన గౌరవం ఇది. నిజం చెప్పాలంటే భావోద్వేగం ఆపుకోలేకపోతున్నా. విరాట్కు ధన్యవాదాలు. మైక్, నిఖిల్, ఇతర సిబ్బంది ఎంతో మద్దతుగా నిలిచారు. నేను, గేల్ ప్రస్తుతం లేకపోయినా.. ఎప్పటికీ మనమంతా కుటుంబమే’’ అని తెలిపాడు. ఏబీడీ బెంగళూరు జట్టుతో 2011 నుంచి 2021 వరకు ప్రయాణించాడు. అలానే క్రిస్ గేల్ కూడా ఆరేళ్లపాటు బెంగళూరుకు ఆడాడు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్