Shami: నా సక్సెస్ వెనుక ‘రాకెట్ సైన్స్’ ఏమీ లేదు.. ఒకటే కారణం: షమీ
ఐదు వికెట్ల ప్రదర్శనతో శ్రీలంక నడ్డివిరచడంలో మహమ్మద్ షమీ (Shami) కీలక పాత్ర పోషించాడు. దీంతో వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) సెమీస్కు చేరిన తొలి జట్టుగా భారత్ అవతరించింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో (ODI World Cup 2023) రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత బౌలర్ మహమ్మద్ షమీ (Shami) అదరగొట్టాడు. ఇప్పటికే 14 వికెట్లను (కేవలం మూడు మ్యాచుల్లోనే) తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మెగా టోర్నీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గానూ అవతరించాడు. ఈ క్రమంలో జహీర్ ఖాన్ (44), శ్రీనాథ్ (44)ను అధిగమించాడు. ప్రస్తుతం 45 వికెట్లతో కొనసాగుతున్నాడు. అయితే, తన సక్సెస్ వెనుక ఎలాంటి ‘రాకెట్ సైన్స్’ సూత్రాలు లేవంటూ షమీ వ్యాఖ్యానించాడు. శ్రీలంకపై 5/18 ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. నిలకడగా లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బౌలింగ్ చేయడం వల్లే ఇది సాధ్యమైందని షమీ స్పష్టం చేశాడు.
‘‘కెరీర్ ఆరంభం నుంచి నేను పాటించే ఒకటే సూత్రం లైన్ అండ్ లెంగ్త్. సరైన ప్రాంతంలో బంతిని పిచ్ చేసి లయను దొరకబుచ్చుకోవడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే ఇలాంటి మెగా సమరంలో ఒక్కసారి ఆ రిథమ్ పోయిందంటే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. అందుకే, తొలి మ్యాచ్ నుంచి లెంగ్త్తో బంతులను సంధించా. అదే వర్కౌట్ అయింది. అలాంటప్పుడు మళ్లీ రిపీట్ ఎందుకు చేయకూడదు? అనిపించింది. అలా చేయడం కష్టమే కానీ.. ప్రయత్నించడం తప్పు కాదు. నేను అదే చేశా. తెల్ల బంతి క్రికెట్లో లైన్ అండ్ లెంగ్త్ చాలా కీలకం. అప్పుడు పిచ్ నుంచి కూడా సహకారం లభిస్తుంది. నేను విజయవంతం కావడానికి కారణం కూడా అదే. అంతేకానీ, ఇందులో రాకెట్ సైన్స్ సూత్రాలేమీ ఉండవు. అయితే, ఇలా రాణించడానికి మంచి ఆహారం తీసుకోవడంతోపాటు మానసికంగానూ దృఢంగా ఉండాలి. అన్నింటి కంటే అభిమానుల ప్రేమను ఆస్వాదించాలి. ఎక్కడకెళ్లినా వారి నుంచి వచ్చే మద్దతు అద్భుతం. విదేశాలకు వెళ్లినాసరే భారతీయులు భారీగా వస్తారు. ప్రతి ఒక్కరినీ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని షమీ వ్యాఖ్యానించాడు.
ప్రధాని మోదీ అభినందనలు..
శ్రీలంకపై టీమ్ఇండియా ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వరల్డ్ కప్లో భారత్ సెమీస్కు చేరుకోవడంతో ఈ మేరకు మోదీ స్పందించారు. ‘‘టీమ్ఇండియా వరల్డ్ కప్లో దూసుకుపోతోంది. శ్రీలంకను చిత్తు చేసి ఘన విజయం సాధించిన టీమ్ఇండియాకు అభినందనలు. జట్టు సమష్టి కృషికి తార్కాణంగా నిలిచింది’’ అని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు