Cricket News: అమ్మ త్వరగా కోలుకోవాలని షమీ స్పెషల్ పోస్టు.. తనపై ట్రోలింగ్కు సమాధానం ఇచ్చిన జాంటీ రోడ్స్!
ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ షమీ (Shami) తన తల్లి వేగంగా కోలుకుని ఇంటికి రావాలని ఆకాంక్షించాడు. మరోవైపు తనపై వస్తున్న ట్రోలింగ్కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ (Jonty Rhodes) స్పందించాడు. ఇక అఫ్గాన్ స్టార్ రషీద్ ఖాన్ (Rashid Khan) శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి క్రికెటర్ల విశేషాలు మీ కోసం..
అమ్మా..నువ్వంటే ఎంతో ఇష్టం: షమీ
వన్డే ప్రపంచ కప్లో టాప్ వికెట్ టేకర్ మహమ్మద్ షమీ. అయితే ఆసీస్తో ఫైనల్ జరుగుతున్నప్పుడే షమీ తల్లి అనుమ్ అరా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆమెను వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించారు. జ్వరం, ఆందోళనతో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఈ క్రమంలో షమీ తన తల్లిని ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘అమ్మా నువ్వంటే ఎంతో ఇష్టం. త్వరగా కోలుకుని వచ్చేస్తావని ఆశిస్తున్నా’ అని పోస్టు చేశాడు.
అతడు నా డ్రైవర్ కాదు..: జాంటీ రోడ్స్
సోషల్ మీడియాలో ప్రతి దానిని ట్రోలింగ్ చేయడం అలవాటైపోయింది. ఎవరు ఏం చేసినా దానిలో నెగిటివిటీని వెతికి మరీ చూస్తున్నారు తప్పితే వాస్తవం ఏంటనేది పట్టించుకోలేదు. ఇలాంటి అనుభవమే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్కు ఎదురైంది. ఓ హోటల్లో దిగిన ఫొటో నెట్టింట విపరీతంగా ట్రోలింగ్కు గురైంది. దీంతో అందులో ఏం పొరపాటు లేదని రోడ్స్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బెంగళూరులో ఓ రెస్టరెంట్కు వెళ్లిన రోడ్స్ అక్కడ టేబుల్ వద్ద టిఫిన్ చేస్తూ ఓ ఫొటో దిగాడు. దానిని తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ టేబుల్కు మరోవైపు ఓ పెద్దాయన కూర్చొని ఉన్నాడు. దానిని హైలైట్ చేస్తూ కొందరు ‘‘సెలబ్రిటీ అయినంత మాత్రాన సరిపోదు’’ అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో దానికి రోడ్స్ ప్రతిస్పందించాడు.
‘‘ఇలాంటి కామెంట్లపై స్పందించడానికి కొన్ని రోజుల సమయం తీసుకోవాల్సి వచ్చింది. నా టేబుల్ వద్ద కూర్చున్న వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఈ ఫొటోను నా డ్రైవర్ తీశాడు. అతడు ఏమీ తినలేదు. నా కోసం అతడి ఫేవరెట్ ఫుడ్ను ఆర్డర్ చేశాడు. తను టీ మాత్రమే తాగాడు. నేనే బిల్లు కట్టాను’’ అని రోడ్స్ పోస్టు పెట్టాడు. దీంతో రోడ్స్కు మద్దతుగా ‘మీరు ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్ను పట్టించుకోవద్దు. మీరు దిగ్గజం’ అని అభిమానులు ట్వీట్లు చేశారు.
రషీద్ ఖాన్కు శస్త్రచికిత్స
వన్డే ప్రపంచకప్లో తన ఆటతీరుతో యావత్ క్రికెట్ అభిమానులను అలరించిన అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్కు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమైంది. దీంతో ఇప్పటికే బిగ్బాష్ లీగ్ నుంచి వైదొలిగాడు. డిసెంబర్ 7 నుంచి బీబీఎల్ ప్రారంభం కానుంది. యూకేలో ఆపరేషన్ చేయించుకుంటాడని అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB) ఓ ప్రకటన వెలువరించింది. ‘‘అఫ్గాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ చిన్న శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. యూకేలో డాక్టర్ జేమ్స్ అలీబోన్ ఈ ఆపరేషన్ చేయనున్నారు. శస్త్రచికిత్స అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. త్వరలోనే అతడి ఆటను మళ్లీ చూడబోతున్నాం’’ అని అఫ్గాన్ బోర్డు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్