MS Dhoni: ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఎడమ మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. రెండ్రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయొచ్చని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ తెలిపాడు.
ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఎడమ మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్లో మహీ మోకాలి సమస్యతో బాధపడ్డ విషయం తెలిసిందే. కప్ గెలిచిన 48 గంటల్లోనే శస్త్రచికిత్స కోసం అహ్మదాబాద్ నుంచి ముంబయికి వెళ్లాడు. గురువారం బీసీసీఐ మెడికల్ ప్యానెల్లో సభ్యుడైన డాక్టర్ దిన్షా పార్ధివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ధోని మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించింది. డాక్టర్ దిన్షా గతంలో రిషబ్ పంత్, నీరజ్ చోప్రాలకు ఆపరేషన్లు చేశారు.
‘‘ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ధోని మోకాలికి శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆయన బానే ఉన్నారు. రెండ్రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు. తర్వాత కొంత కాలంపాటు ధోని విశ్రాంతి తీసుకుంటారు. మరో ఐపీఎల్కు సన్నద్ధమయ్యేందుకు ఇప్పుడు ధోనికి మరింత సమయం దొరుకుతుంది’’ అని సీఎస్కే (CSK) సీఈవో విశ్వనాథన్ తెలిపారు. ఈ ఐపీఎల్లో మోకాలి గాయంతో ధోని ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఒకానొక సందర్భంలో తనను వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తించ వద్దని సహచర బ్యాటర్లను కోరాడు. మరోవైపు ధోనీ ఈ సీజన్తోనే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడేమో అన్న చర్చ కూడా జరిగింది. కానీ చెన్నైకి అయిదో ట్రోఫీ అందించిన అనంతరం ధోని మాట్లాడుతూ.. కష్టమైనప్పటికీ అభిమానుల కోసం ఇంకో సీజన్ ఆడేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.