Neeraj Chopra: ఒలింపిక్స్‌ కోసం వాటికి ఆరు నెలలు దూరంగా ఉన్నాడు

అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్‌  పతకం కోసం భారతీయుల వందేళ్ల నిరీక్షణకు  నీరజ్‌ చోప్రా తెరదించాడు. విశ్వ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం నెగ్గి భారతీయుల ముఖాల్లో ఆనందం నింపాడు  23 ఏళ్ల హరియాణా కుర్రాడు నీరజ్‌ చోప్రా.  అయితే, తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చోప్రా మాట్లాడాడు. 

Updated : 08 Aug 2021 11:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్‌ పతకం కోసం భారతీయుల వందేళ్ల నిరీక్షణకు నీరజ్‌ చోప్రా తెరదించాడు. విశ్వ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం నెగ్గి భారతీయుల ముఖాల్లో ఆనందం నింపాడు  23 ఏళ్ల హరియాణా కుర్రాడు నీరజ్‌ చోప్రా.  అయితే, తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చోప్రా మాట్లాడాడు. పానీపూరిలు, స్వీట్లు ఆరగించడం చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

‘పానీపూరిలు తినడం వల్ల ఎటువంటి హాని లేదని అనుకుంటున్నా. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. మన పొట్టలో అధిక భాగం నీటితో నిండి ఉంటుంది. పానీపూరి చూడటానికి పెద్దగా కనిపించినా దానిలో చాలా తక్కువ పిండి ఉంటుంది. ఎక్కువగా తింటున్నామని మీకు అనిపించినప్పటికీ  వాటిని ఆరగించడం ద్వారా ఎక్కువ నీరు తీసుకుంటారు. వీటిని రోజూ తినాలని నేను సూచించను. అయితే, అప్పుడప్పుడు పానీపూరి తినడం మంచిదేనని ఒక అథ్లెట్‌గా అనుకుంటున్నా’ అని నీరజ్‌ చోప్రా అన్నాడు.

చోప్రాకు ఇష్టమైన  మరో ఆహారం ఏంటంటే...ఇంట్లో తయారుచేసిన చుర్మా(పంచదార, నెయ్యితో చేసిన రోటీ). నీరజ్‌.. రాక కోసం ఎదురుచూస్తున్నానని చోప్రా తల్లి సరోజ్‌ అన్నారు. నీరజ్‌ రాగానే అతనికిష్టమైన చుర్మా వంటకం తినిపించాలని ఉందని ఆమె చెప్పారు. స్వీట్లు తినాలని ఉన్నా.. ఈవెంట్స్‌కు ముందు వాటికి దూరంగా ఉండేవాడని సరోజ్‌  పేర్కొన్నారు. ఒలింపిక్స్‌ కోసం ఆరు నెలల ముందు నుంచి వాటిని తినడం మానేశాడని ఆమె తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని