MS Dhoni- WC 2019: ధోనీ రనౌట్ వల్లే మేం ఫైనల్కు చేరుకోగలిగాం.. లేదంటే: కివీస్ పేసర్
క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తూ గత వరల్డ్ కప్లో ధోనీ రనౌట్ అయిన తీరు గుర్తుండే ఉంటుంది. విజయం కోసం చివరి వరకూ పోరాడిన ధోనీ ఔట్ కావడంతో భారత్ సెమీస్లోనే వెనుదిరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో మూడు సంఘటనలు తప్పకుండా గుర్తుండిపోతాయి. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983 టైటిల్, ఇక 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సిక్స్తో భారత పతాకం రెపరెపలాడేలా చేసిన ఎంఎస్ ధోనీ షాట్ మన కళ్ల ముందు ఉండిపోతాయి. ఇలాంటిదే గత వన్డే ప్రపంచకప్లో (2019)నూ ఓ సంఘటన ఉంది. సెమీస్లో న్యూజిలాండ్పై కీలకమైన సమయంలో (49వ ఓవర్) ధోనీ రనౌట్గా నిలవడం.. ఆ వెంటనే కివీస్ విజయం సాధించి ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. టెయిలెండర్లతో పోరాడిన ధోనీ మరో 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన క్రమంలో పెవిలియన్కు చేరడంతో భారత్కు ఓటమి తప్పలేదు. గతంలో ఎన్నోసార్లు చివర్లో వీరోచిత ఇన్నింగ్స్లు ఆడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో అప్పుడు 49వ ఓవర్ వేసిన కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తాజాగా ధోనీ రనౌట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీని రనౌట్ చేయడం వల్ల తమ జట్టు ఫైనల్కు చేరుకుందని పేర్కొన్నాడు.
‘‘ధోనీ గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. అతడు ఒక్కసారి కుదురుకుని గేర్ మార్చడం మొదలైతే ఆపడం ఎవరి తరమూ కాదు. అతడిని ఔట్ చేయడం ద్వారా మేం అలవోకగా ఫైనల్కు చేరుకోగలిగాం. ఆ తర్వాత సంబరాలు చేసుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది’’ అని ఫెర్గూసన్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు రాస్ టేలర్ కూడా ధోనీని ఔట్ చేయడం వల్లే తాము ఫైనల్కు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే, టైటిల్ కోసం జరిగిన పోరులో కివీస్పై ఇంగ్లాండ్ విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!