T20 World Cup: పగ తీర్చుకున్న కివీస్.. ఫైనల్లో అడుగు
టీ20 ప్రపంచకప్లో భాగంగా తొలి సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్ గండాన్ని న్యూజిలాండ్ ఎట్టకేలకు దాటింది. 2016 టీ20 ప్రపంచకప్లో సెమీస్, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లీష్ జట్టులో చేతిలోనే కంగుతిన్న కివీస్ ఈ టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఆ జట్టుని చిత్తు చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. మోర్గాన్ సేన నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించి పొట్టి ప్రపంచకప్లో మొదటిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. డారిల్ మిచెల్ (72; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. డేవిన్ కాన్వే (46; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అదిల్ రషీద్ ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వచ్చింది.
లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లో గప్తిల్ (4), మూడో ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) వెనుదిరగడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. కాన్వేతో కలిసి మిచెల్ ఇన్నింగ్స్ని గాడిలో పెట్టాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో పది ఓవర్లకు 58/2తో నిలిచింది కివీస్. దీంతో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోందని అంతా భావించారు. కానీ 11 ఓవర్ నుంచి కివీస్ ఆటగాళ్లు గేర్లు మార్చి ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే లివింగ్ స్టోన్ వేసిన 14 ఓవర్లో కాన్వే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ఫిలిప్ (2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఇంగ్లాండ్ మళ్లీ పోటీలోకి వచ్చినట్లు కనిపించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్ (27; 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు)తో కలిసి మిచెల్ వీరవిహారం చేశాడు. అదిల్ రషీద్ వేసిన 18 ఓవర్లో చివరి బంతికి నీషమ్ పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికి న్యూజిలాండ్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. వోక్స్ వేసిన 19 ఓవర్లో మిచెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో ఒక ఓవర్ మిగిలుండగానే న్యూజిలాండ్ విజయతీరాలకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు