t20 world cup: టీ20 ప్రపంచకప్‌ అంపైర్ల జాబితాలో ఏకైక భారతీయుడు

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీకి అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలుగా వ్యవహరించనున్న వారి జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది.

Published : 05 Oct 2022 02:04 IST

దిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌నకు అంతా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ టోర్నీకి అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలుగా వ్యవహరించనున్న వారి జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇందుకు మొత్తం 16 మంది ఎంపిక కాగా ప్రస్తుతం ఎలైట్‌ ప్యానెల్‌లో ఉన్న ఏకైక భారతీయ అంపైర్‌ నితిన్‌ మేనన్‌కు చోటుదక్కింది. గతేడాది ఒమన్‌ వేదికగా జరిగిన ప్రపంచ టోర్నీలో ఈ బాధ్యతలు చేపట్టిన 16 మందికే ఐసీసీ మరోసారి అవకాశం కల్పించింది. 

అంపైర్లు: అడ్రియన్‌ హోల్డ్‌ స్టాక్‌, అలీం దార్‌, అహ్సన్‌ రజా, క్రిస్టోఫర్‌ బ్రౌన్‌, క్రిస్టోఫర్‌ గఫానే, జోయెల్‌ విల్‌సన్‌, కుమార ధర్మసేన, లాంగ్టన్‌ రుసెరే, మరైస్‌ ఎరాస్మస్‌, మైకెల్‌ గఫ్‌, నితిన్‌ మేనన్‌, పాల్‌ రిఫీల్‌, పాల్‌ విల్‌సన్‌, రిచర్డ్‌ లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిలోబరో, రోడ్నీ టకర్‌. 

మ్యాచ్‌ రిఫరీలు: ఆండ్య్రూ పైక్రాఫ్ట్‌, క్రిస్టోఫర్‌ బ్రాడ్‌, డేవిడ్‌ బూన్‌, రంజన్‌ మదుగలే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని