(సి) పంత్‌ (బి) రబాడా × 19

ఇండియన్‌ టీ20 లీగులో దిల్లీ పేసర్‌ కాగిసో రబాడా, వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు లీగులో 19 మందిని పెవిలియన్‌కు పంపించారు. ఇలాంటి ఘనత మరే బౌలర్‌, ఫీల్డర్‌కూ లేకపోవడంతో గమనార్హం....

Published : 24 Oct 2020 16:44 IST

అబుదాబి: ఇండియన్‌ టీ20 లీగులో దిల్లీ పేసర్‌ కాగిసో రబాడా, వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు లీగులో 19 మందిని పెవిలియన్‌కు పంపించారు. ఇలాంటి ఘనత మరే బౌలర్‌, ఫీల్డర్‌కూ లేకపోవడంతో గమనార్హం.

కోల్‌కతా మ్యాచులో రబాడా ఎనిమిదో ఓవర్‌ వేశాడు. మూడో బంతికి దినేశ్‌ కార్తీక్‌ (3; 6 బంతుల్లో)ను ఔట్‌ చేశాడు. పుల్‌లెంగ్త్‌లో పిచైన బంతి కార్తీక్‌ బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ వైపు గాల్లోకి లేచింది. దానికి పంత్‌ సునాయాసంగా అందుకున్నాడు. దాంతో వీరిద్దరూ కలిసి టీ20 లీగులో 19 మందిని ఔట్‌చేసిన రికార్డు అందుకున్నారు.

అంతకు ముందు పంజాబ్‌ మ్యాచులోనూ వీరిద్దరూ కలిసి ఇద్దరిని పెవిలియన్‌కు పంపించారు. అర్ధశతకం బాది పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన నికోలస్‌ పూరన్‌, కీలక ఇన్నింగ్స్‌ ఆడిన మాక్స్‌వెల్‌.. రబాడా బౌలింగ్‌లోనే ఔటయ్యారు. వీరిద్దరూ పంత్‌కే క్యాచులు ఇవ్వడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని