Ratan Tata: ‘క్రికెట్తో నాకేం సంబంధం లేదు’.. రషీద్ఖాన్కు రూ.10కోట్ల రివార్డ్ వార్తలపై రతన్ టాటా క్లారిటీ
తాను ఏ క్రికెటర్కు రివార్డు ప్రకటించలేదని, క్రికెట్తో తనకు ఏ విధంగానూ సంబంధం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) స్పష్టం చేశారు. తనపై సోషల్మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ టాప్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Afghan cricketer Rashid Khan)కు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీనిపై రతన్ టాటా సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆ వార్తలను కొట్టిపారేశారు. తాను ఏ క్రికెటర్ తరఫున మాట్లాడలేదని, అలాంటి ఫార్వర్డ్ మెసేజ్లను నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..
వన్డే ప్రపంచకప్ టోర్నీ (ODI World Cup 2023)లో భాగంగా ఇటీవల పాకిస్థాన్పై అఫ్గాన్ (AFG vs PAK) సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం జరిగిన అఫ్గాన్ సెలబ్రేషన్స్లో క్రికెటర్ రషీద్ ఖాన్ భారత జెండాను పట్టుకుని కన్పించారని, దీంతో అతడికి ఐసీసీ రూ.55 లక్షలు జరిమానా విధించిందని ఇటీవల కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి రతన్ టాటా.. రషీద్ ఖాన్కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని ఆ పోస్టుల్లో రాసుకొచ్చారు.
ఇంగ్లాండ్పై విక్టరీ మరెంతో ‘స్పెషల్’.. స్టంప్స్నే టార్గెట్ చేస్తూ..!
ఇది కాస్తా సోషల్మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ వార్తలపై రతన్ టాటా తీవ్రంగా స్పందించారు. ‘‘ఏ ఆటగాడి జరిమానా గురించి నేను ఐసీసీ (ICC), ఇతర ఏ క్రికెట్ సంస్థలకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఏ ఆటగాడికి రివార్డు ప్రకటించలేదు. క్రికెట్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా నుంచి అధికారిక సమాచారం వస్తే తప్ప.. ఇలాంటి వాట్సప్ ఫార్వర్డ్ సందేశాలు, అసత్య వీడియోలను నమ్మొద్దు’’ అని రతన్ టాటా (Ratan Tata) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ను అఫ్గాన్ ఓడించింది. ఆ తర్వాత జరిగిన వేడుకల్లో రషీద్ ఖాన్తో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ డ్యాన్స్ చేస్తూ కన్పించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం