Gujarat Titans: హైదరాబాద్తో మ్యాచ్లో గుజరాత్ స్పెషల్ జెర్సీ.. కారణమిదే
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత విజయాన్ని సాధించిన ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. హోంగ్రౌండ్లో ఆడిన తన చివరి మ్యాచ్లో హర్దిక్ సేన ప్రత్యేకంగా లావెండర్ జెర్సీ (Lavender Jersey)తో కన్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: అరంగేట్రంలోనే ఛాంపియన్గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans).. ఈ ఐపీఎల్ (IPL) సీజన్లోనూ అదరగొడుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హార్దిక్ (Hardik Pandya) సేన.. ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. గత రాత్రి సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఎప్పటిలా ముదురు నీలం రంగు కాకుండా లావెండరీ (ఊదా రంగు) కలర్ జెర్సీలో కన్పించింది. దీని వెనుక ఓ గొప్ప కారణం ఉంది. క్యాన్సర్ (Cancer)పై అవగాహన కల్పించేందుకే టైటాన్స్ ఆటగాళ్లు ఈ ప్రత్యేక జెర్సీ ధరించినట్లు ఆ జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది.
‘‘ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల గుజరాత్ టైటాన్స్ ఆరాటపడుతుంది. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు, ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు మా వంతు ప్రయత్నం ఇది’’ అని టైటాన్స్ జట్టు ట్విటర్లో వెల్లడించింది. గుజరాత్ జట్టు అహ్మదాబాద్లో ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ సోమవారం ఆడింది. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక లావెండర్ జెర్సీ (Lavender Jersey)ని ధరించింది. దీనిపై టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడుతూ.. ‘‘మన దేశంలోనే గాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్యాన్సర్ (Cancer)తో పోరాడుతున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడం మా బాధ్యతగా భావించాం. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకే మేం లావెండర్ జెర్సీ వేసుకున్నాం. ఈ చర్య ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని తెలిపాడు.
గతంలో దిల్లీ కూడా..
సాధారణంగా అన్నవాహిక క్యాన్సర్కు సూచికగా లావెండర్ రంగును ఉపయోగిస్తారు. అయితే, ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్లకు ఈ రంగునే సూచికగా వినియోగిస్తున్నారు. కాగా.. ఐపీఎల్లో ఆటగాళ్లు లావెండర్ జెర్సీ (Lavender Jersey)తో కన్పించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2015లో దిల్లీ డేర్డెవిల్స్ (ఇప్పటి దిల్లీ క్యాపిటల్స్) కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. క్యాన్సర్ను జయించిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలో ఆ జట్టు ఊదా రంగు జెర్సీలో ఓ మ్యాచ్ ఆడింది.
ఇక ఐపీఎల్ (IPL)లో మరో జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా ఏటా ఒక మ్యాచ్లో గ్రీన్ జెర్సీ ధరిస్తున్న విషయం తెలిసిందే. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు 2011 నుంచి ఆర్సీబీ తన హోం గ్రౌండ్లో జరిగే ఒక మ్యాచ్లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా మార్చుకుంది. ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ కూడా జెర్సీలో చిన్న మార్పు చేసి బరిలోకి దిగింది. ఆడపిల్లలు క్రీడలను తమ కెరీర్గా ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు ఏప్రిల్ 16న కోల్కతాతో ఆడిన మ్యాచ్లో ప్రత్యేక జెర్సీ ధరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.