DK - Rohit Sharma: ‘వరల్డ్ కప్ ఆడాలి’.. దినేశ్ కార్తిక్ను స్లెడ్జ్ చేసిన రోహిత్!
భారత క్రికెటర్లు స్లెడ్జ్ చేయడం చాలా తక్కువ. విదేశీ జట్లతో ఆడేటప్పుడు మాత్రమే అది మైదానంలో కనిపిస్తుంది. కానీ, ఇక్కడ భారత సీనియర్ ప్లేయర్నే రోహిత్ శర్మ స్లెడ్జ్ చేయడం గమనార్హం. అయితే, అదంతా సరదాగానే సాగింది.
ఇంటర్నెట్ డెస్క్: డీకే.. దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఈ పేరు వింటే తప్పకుండా ‘ది ఫినిషర్’ గుర్తుకొస్తాడు. భారత జట్టుకు కొన్నాళ్లపాటు ఈ పాత్రను పోషించాడు. ఇప్పుడు బెంగళూరు జట్టులో అద్భుతంగా ఆడుతున్న ఇద్దరు బ్యాటర్లలో డీకే ఒకడు. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ రాణిస్తుంటే.. లోయర్ ఆర్డర్లో దూకుడుగా ఆడుతూ బెంగళూరు మంచి స్కోరు సాధించడంలో కార్తిక్ కీలకంగా మారాడు. వచ్చే టీ20 ప్రపంచ కప్ రేసులో తానూ ఉన్నట్లు సెలక్టర్లకు బలమైన సంకేతాలు పంపేలా ప్రస్తుత ఐపీఎల్లో విరుచుకుపడుతున్నాడు. ముంబయితో జరిగిన మ్యాచ్లోనూ దూకుడు ప్రదర్శించాడు. ఈ సందర్భంగా డీకేను రోహిత్ శర్మ (Rohit Sharma) సరదాగా స్లెడ్జ్ చేయడం స్టంప్ మైక్లో రికార్డైంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘‘వరల్డ్ కప్ను మదిలో పెట్టుకొని ఆడుతున్నాడు. జట్టు సెలక్షన్ కోసం ప్రోత్సహిద్దాం. శభాష్ డీకే.. కమాన్ ప్రపంచ కప్ ఆడాలని ఉందా? అదరగొట్టేస్తున్నావు. డీకే.. నువ్వు ప్రపంచ కప్ ఆడాలి’’ అని రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, అందుకు తగ్గట్టే డీకే కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
నా బ్యాడ్లక్..
రోహిత్కు మైదానంలోని స్టంప్ మైక్తో ఓ విడదీయని బంధం ఉంది. అతడు ఆటగాళ్లతో జరిపే సంభాషణలు తరచూ దీనిలో రికార్డై వైరలవుతుంటాయి. ఈ అంశంపై ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ‘‘మీరు కోపంలో ఎవరికైనా హితబోధ చేశారా..? మీ మ్యాచ్ ఫీజులో కోతపడిందా..?’’ అని కపిల్ సరదాగా అడిగాడు. దీనికి రోహిత్ నవ్వుతూ ‘‘డబ్బులు కట్కావు.. మేము హిందీలో మాట్లాడుకుంటాము.. మ్యాచ్ రిఫరీకి ఇంగ్లిష్ మాత్రమే అర్థమవుతుంది. కుర్రాళ్లు బాగా ఆడండి. మ్యాచ్ గెలవాలి అని మాత్రమే చెబుతాను.. అంతకు మించి ఏమీ అనను. కానీ, అసలు విషయం ఏమిటంటే.. నేను మైదానంలో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటా.. కానీ, దురదృష్టవశాత్తు ఆ టైంలో నేను మైకు వెనకే ఉంటాను. నేను మాట్లాడే ప్రతిదీ అందరికీ వినిపిస్తుంది. ఏంచేస్తాం సర్.. మా కుర్రాళ్లు సోమరి కోళ్లు. పరుగెత్తరు.. చెప్పాల్సి వస్తుంది’’ అని సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనికి ప్రేక్షకులు పగలబడి నవ్వారు. సాధారణంగా రోహిత్ మైదానంలో తనదైన యాసలో ఫీల్డింగ్ సెట్ చేయడం.. లేదా తోటి ఆటగాళ్లతో సంభాషించడం చేస్తుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు