Dhoni: ఈ భారత జట్టును అతడే తీర్చిదిద్దాడు
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంటే జట్టులోని ప్రతి ఒక్కరికీ ఎంతో అభిమానం, గౌరవం. ఏ ఆటగాడిని కదిలించినా ఇదే విషయం చెబుతారు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంటే జట్టులోని ప్రతి ఒక్కరికీ ఎంతో అభిమానం, గౌరవం. ఏ ఆటగాడిని కదిలించినా ఇదే విషయం చెబుతారు. ఎందుకంటే మహీ ఈ జట్టుపై అంతలా ప్రభావం చూపాడు. తన ఆటతోనే కాకుండా కెప్టెన్సీ, వ్యక్తిత్వంతోనూ అతడు ఉన్నత శిఖరాలకు చేరాడు. దాంతో అతడు టీమ్ఇండియాకు దూరమై రెండేళ్లు గడుస్తున్నా మిగతా ఆటగాళ్లు ఇప్పటికీ మిస్ అవుతున్నారనే భావన నెలకొంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ సాబా కరిమ్ను అడగ్గా ఇలా స్పందించాడు.
‘టీమ్ఇండియా ఆటగాళ్లు ఇప్పటికీ ధోనీని మిస్ అవ్వడానికి ప్రధాన కారణం.. ప్రస్తుత జట్టులోని ప్రతి ఒక్కరూ అతడి సారథ్యంలోనే అంతర్జాతీయ కెరీర్ ఆరంభించారు. ఈ ఆటగాళ్లందరినీ అతను తీర్చిదిద్దిన విధానం ఎంతో గొప్పది. వాళ్లని ముందుండి నడిపించాడు. మ్యాచ్ విన్నర్లుగా తయారుచేశాడు. అందుకే ప్రతి ఒక్కరూ అతడి గురించి గొప్పగా చెబుతారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ధోనీ ఏం చేశాడో ఆటగాళ్లే కాకుండా అభిమానులందరికీ తెలుసు. తన ఆటలో ఎక్కడా ఒత్తిడికి గురైనట్లు కనిపించడు. ఈ క్రమంలోనే అతడి నుంచి టీమ్ఇండియా ఆటగాళ్లు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు’ అని మాజీ క్రికెటర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక