RR vs SRH: అదంతా సందీప్ శర్మకు తెలుసు.. మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు: సంజూ
ఈ సీజన్ రాజస్థాన్ ఆడిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ను (RR vs SRH) ఘోరంగా ఓడించింది. అదీనూ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. ఇప్పుడు తమ సొంతమైదానంలో (జైపుర్) మాత్రం ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్క నో బాల్ మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. ఐపీఎల్ చరిత్రలో (IPL) సన్రైజర్స్ హైదరాబాద్కు అద్భుత విజయం అందించగా.. సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్కు (RR vs SRH) చుక్కెదురైంది. ఆదివారం జైపుర్ వేదికగా రాజస్థాన్ - హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి బంతిని సందీప్ శర్మ ‘నో బాల్’గా వేశాడు. సన్రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్ చక్కని సిక్స్తో మ్యాచ్ను గెలిపించాడు. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుందామని భావించిన రాజస్థాన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆఖరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించడంతోపాటు చివరి బంతి నోబాల్ కావడంపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు.
‘‘ఐపీఎల్ మ్యాచ్లు అంటే ఇలానే ఉంటాయి. చివరి వరకు గెలిచేశామనే భ్రమలో ఉండకూడదు. ఫలితం ఎప్పుడైనా ఠక్కున మారిపోతుంది. ప్రత్యర్థి జట్టు కూడా విజయం కోసం పోరాడం సహజమే. సందీప్ శర్మపై నాకు నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న మ్యాచ్ను (చెన్నైతో) సందీప్ గెలిపించాడు. అయితే, చివరి బంతి నో బాల్గా పడటంతో విజయం మా నుంచి దూరమైంది. కానీ, నో బాల్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. సందీప్ శర్మకు ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు. చివర్లో మేం గెలిచినట్లు కాస్త సంబరం పడ్డాం కానీ, అయితే ఒకే ఒక్క బంతితో ఫలితం తారుమారు అయిపోయింది’’ అని సంజూ పేర్కొన్నాడు.
రిషభ్ పంత్ తర్వాత యశస్వి
ప్రస్తుత సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న రాజస్థాన్ యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ హైదరాబాద్పైనా దూకుడుగానే ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 35 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో 477 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో తక్కువ వయసులోనే ఐపీఎల్లో వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్గా అవతరించాడు. జైస్వాల్ 21 ఏళ్ల 130 రోజుల వయసులో 1000 పరుగుల మార్క్ను తాకాడు. రిషభ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులోనే ఈ ఫీట్ను సాధించి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక దిల్లీ బ్యాటర్ పృథ్వీ షా (21 ఏళ్ల 130 రోజులు) మూడో స్థానంలో ఉన్నాడు.
నాలుగులోనే రాజస్థాన్
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (10 పాయింట్లు) ఉన్నప్పటికీ.. మిగతా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే ఫ్లేఆఫ్స్కు చేరే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్కు (8 పాయింట్లు) కూడా ఛాన్స్లు మిగిలే ఉన్నాయి. చివరి నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఇతర జట్ల ఫలితాలను బట్టి ఎస్ఆర్హెచ్కు అవకాశం ఉంది. గుజరాత్ (16 పాయింట్లు), చెన్నై (13 పాయింట్లు), లఖ్నవూ (11 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.