Prithvi Shaw: దాడి చేయొద్దని పృథ్వీ షాను వేడుకున్నా.. క్రికెటర్పై సప్నాగిల్ ఫిర్యాదు
సెల్ఫీ దాడి ఘటనతో వార్తల్లో నిలిచిన టీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కొత్త సమస్యల్లో చిక్కుకున్నాడు. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్ సప్నా గిల్.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబయి: సెల్ఫీ కోసం టీమ్ఇండియా (Team India) ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)పై దాడి ఘటన ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో వార్తల్లో నిలిచిన పృథ్వీ.. ఇప్పుడు కొత్త సమస్యల్లో చిక్కుకున్నాడు. ఈ కేసులో నిందితురాలిగా అరెస్టయిన యూట్యూబర్ సప్నా గిల్.. ఈ యువ క్రికెటర్పై ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగించినందుకు గానూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబయి పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు.
గతవారం ముంబయి (Mumbai)లోని ఓ ప్రముఖ హోటల్ వద్ద పృథ్వీ షా, అతడి స్నేహితులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పృథ్వీ సెల్ఫీ (Selfie) నిరాకరించడంతో అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాక, స్నేహితుడి కారును ధ్వంసం చేశారు. అంతేగాక, తప్పుడు కేసు పెడతామంటూ నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సప్నా గిల్ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సప్నా గిల్ను కోర్టులో హాజరుపర్చగా.. ఆమెకు మూడు రోజుల కస్టడీ విధించారు.
ఆ కస్టడీ సోమవారం నాటికి ముగియడంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటకు వచ్చిన సప్నా.. నిన్న అంధేరీ పోలీసు స్టేషన్లో పృథ్వీ షా (Prithvi Shaw), అతడి స్నేహితులపై ఫిర్యాదు చేశారు. ‘‘నా ఫ్రెండ్తో కలిసి నేను హోటల్కు వెళ్లగా అక్కడ పృథ్వీ షా తన స్నేహితులతో కన్పించాడు. నా స్నేహితుడు ఓ టీనేజర్. క్రికెట్ అభిమాని కావడంతో సెల్ఫీ కోసం వాళ్ల వద్దకు వెళ్లాడు. అప్పటికే పృథ్వీ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారో నా స్నేహితుడికి తెలియదు. వారు అతడిపై దాడి చేశారు. అందువల్లే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నా స్నేహితుడిని కాపాడేందుకే నేను మధ్యలో వెళ్లాను. నా ఫ్రెండ్కు హానీ చేయొద్దని పృథ్వీషాను వేడుకున్నా. కానీ, వారు వినిపించుకోలేదు. పైగా నేను దాడి చేశానని అంటూ నాపై కేసు పెట్టారు’’ అని సప్నా గిల్ తన దరఖాస్తులో ఆరోపించారు. తన పరువు, మర్యాదలకు భంగం కలిగించినందుకు గానూ పృథ్వీ (Prithvi Shaw), అతడి స్నేహితులపై కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!