Virat Kohli : పాకిస్థాన్ సూపర్ లీగ్లో.. కోహ్లీ పోస్టర్.!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లోనూ విరాట్ని ఆరాధించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అతడు క్రీజులో..
(Photo: Shoaib Akhtar twiiter)
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లోనూ విరాట్ని ఆరాధించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అతడు క్రీజులో కుదురుకుంటే అభిమానులకు పండగే. కళాత్మక షాట్లతో అలరిస్తుంటాడు. తన బ్యాటింగ్తో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు.
తాజాగా, పాక్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని ‘విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్లో సెంచరీ కొడితే చూడాలని ఉంది’ అని రాసి ఉన్న పోస్టర్ని పట్టుకుని కనిపించాడు. ఆ ఫొటోను పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన ట్విటర్ ఖాతాలో పంచుకుని.. ‘గఢాపీ స్టేడియంలో ఓ వ్యక్తి ఇలా అభిమానం చాటుకున్నాడు’ అనే వ్యాఖ్యను జత చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ నమోదు చేయక రెండేళ్లకు పైగా అవుతోంది. చివరి సారిగా నవంబరు 2019లో శతకం బాదాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. అయినా అతడి సగటు 40కి పైగా ఉండటం విశేషం. అప్పుడప్పుడు అర్ద శతకాలు నమోదు చేస్తున్నా.. వాటిని శతకాలుగా మార్చలేకపోతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ 70 శతకాలు (వన్డేల్లో 43, టెస్టుల్లో 27) నమోదు చేశాడు. కోహ్లీ బ్యాటు నుంచి 71వ శతకం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.! ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ.. మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్కు అందుబాటులోకి రానున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.