పాకిస్థాన్లో తెలిసిన వాళ్లనే ఎంపిక చేస్తారు
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ప్రతిభను చూడకుండా.. తమకు ఇష్టమైనవారినే ఎంపిక చేస్తారని లేకపోతే చేయరని వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అక్కడి క్రీడా జర్నలిస్టు సజ్ సాధిక్ వరుస ట్వీట్లు చేశారు...
పీసీబీపై షోయబ్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ప్రతిభను చూడకుండా.. తమకు ఇష్టమైనవారినే ఎంపిక చేస్తారని ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పీసీబీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు అక్కడి క్రీడా జర్నలిస్టు సజ్ సాధిక్ వరుస ట్వీట్లు చేశారు.
‘మా వద్ద ఆటగాళ్లను ఇష్టపడటం, ఇష్టపడకపోవడం లాంటి పద్ధతి ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర రంగాల్లో ఉన్నా మా క్రికెట్లో ఇంకాస్త ఎక్కువ ఉంది. మా క్రికెట్ బోర్డులో ఆటగాళ్లను తెలిసిన వ్యక్తులని కాకుండా వారి ప్రతిభ చూసి ఎంపిక చేసిన రోజే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇటీవల ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్ బాబర్ కావాలనుకున్న ఆటగాళ్లలో చాలా మందికి చోటుదక్కలేదు. సెలెక్షన్ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సింది కెప్టెనే. ఎందుకంటే మైదానంలో ఏం కావాలనేది తెలిసేది అతడికే’ అని మాలిక్ అన్నాడు.
‘పీఎస్ఎల్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి. అదో మంచి టోర్నీ. కనీసం రెండు సీజన్లలో ఆయా ఆటగాళ్ల నిలకడను పరిశీలించి ఎంపిక చేయాలి. కేవలం ఒక ఇన్నింగ్స్లో బాగా ఆడితే లేదా ఒక స్పెల్లో అద్భుత బౌలింగ్ చేస్తే ఎంపిక చేయొద్దు. ఈ విషయాన్ని ఇలా బయటకు చెప్పడం వల్ల నా భవిష్యత్పై బెంగలేదు. అది ఎవరి చేతుల్లోనూ లేదు. అంతా దేవుడే చూసుకుంటాడు. నన్ను మళ్లీ టీ20 జట్టులో ఆడనివ్వకపోయినా పశ్చాత్తాపం పడను. కానీ తోటి క్రికెటర్ల కోసం ఇప్పుడైనా స్పందించకుంటే అంతకన్నా ఎక్కువ పశ్చాత్తాపం చెందుతా. అలాగే నేను మిస్బాకు వ్యతిరేకం కాదు. అతడో మంచి క్రికెటర్. నేను అమితంగా గౌరవిస్తా. అయితే, అతడు జాతీయ జట్టుకు కోచ్గా చేయడానికి ముందు దేశవాళీ క్రికెట్లో పనిచేయాల్సింది. ఆ తర్వాతే పాక్ జట్టుకు రావాల్సింది. నేనెంతో మంది కెప్టెన్లతో కలిసి ఆడాను. వాళ్లంతా తమకు నచ్చిన నిర్ణయాలు ధైర్యంగా తీసుకునేవారు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, షాహిద్ అఫ్రిది లాంటి దిగ్గజాలతో ఆడాను. కెప్టెన్గా ఉండాలంటే ఇతరులను కాకా పట్టడం పనిచేయదు. అలాంటి వాళ్లెప్పుడూ సంతోషంగా ఉండరు. అలా చేస్తే ఎక్కువ కాలం కూడా కెప్టెన్గా కొనసాగరు’ అని మాలిక్ చెప్పినట్లు సాధిక్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?