Sports News: వాళ్లను కలవడం వల్లే వైరస్ సోకి ఉండొచ్చు
ఐపీఎల్ బయోబుడగలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను కలవడం వల్లే తనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్, కీపర్ వృద్ధిమాన్ సాహా అనుమానం వ్యక్తం చేశాడు...
అనుమానం వ్యక్తం చేసిన సన్రైజర్స్ కీపర్..
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ బయోబుడగలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను కలవడం వల్లే తనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్, కీపర్ వృద్ధిమాన్ సాహా అనుమానం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిందని, అప్పుడు తాను వారితో కలిసి మాట్లాడానని సాహా పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ.. వారిని కలిసిన కొద్ది రోజులకే సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి వైరస్ నిర్ధరణ కాగా, అనంతరం తనకూ పాజిటివ్గా తేలిందని సన్రైజర్స్ బ్యాట్స్మన్ గుర్తు చేసుకున్నాడు.
‘మేం దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టాక అక్కడి పరిసరాలను వాడుకున్నాం. తర్వాత సీఎస్కే జట్టుతో మ్యాచ్ ఆడాం. ఒకవేళ నాకు ఎయిర్పోర్ట్లోనే వైరస్ సోకితే అది చెన్నైతో మ్యాచ్కు ముందురోజు లేదా మ్యాచ్ జరిగిన రోజే లక్షణాలు కనిపించేవి. కానీ, నాకు పాజిటివ్గా తేలిన ముందు రోజు ఆ జట్టులోని పలువురిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. అంతకు రెండు రోజుల ముందే చెన్నై జట్టుతో మేం మ్యాచ్ ఆడాం. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా వారితో ముచ్చటించాను. ఈ నేపథ్యంలో నాకు వైరస్ సోకడానికి వారిని కలవడమే కారణమని భావిస్తున్నా’ అని సాహా అభిప్రాయపడ్డాడు.
అలాగే ఈసారి కూడా ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించాల్సి ఉండేదని, కరోనా వైరస్ పరిస్థితుల గురించి నిర్వాహకులు ముందే ఒక అంచనాకు రావాల్సిందని సాహా పేర్కొన్నాడు. గతేడాది యూఏఈలో ఏర్పాటు చేసిన బయోబుడగతో పోలిస్తే ఇక్కడ అంత కఠినంగా లేదని అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కొంత మంది ప్రజలు, పిల్లలు మ్యాచ్లు జరిగే ప్రదేశాల్లో గోడల మీద నుంచి తొంగి చూసేవాళ్లని గుర్తుచేసుకున్నాడు.
మరోవైపు కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు మాత్రం శరీరం ఎలా స్పందిస్తుందో తెలుస్తుందని సాహా అన్నాడు. ఇక కరోనా సోకినప్పుడు తొలుత రెండు రోజులు జ్వరం వచ్చిందని, ఆపై ఐదు రోజులకు వాసన కోల్పోయినట్లు చెప్పాడు. మళ్లీ నాలుగు రోజులకే సాధారణ స్థితికి చేరుకున్నానన్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, సినిమాలు చూడటం లాంటివి చేశానని సాహా గుర్తుచేసుకున్నాడు. వైరస్ విషయంలో తానెప్పుడూ మానసికంగా కుంగిపోలేదన్నాడు. అయితే, ఆ సమయంలో బయటి విషయాలు పట్టించుకోకపోవడమే మంచిదని సలహా ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి