Cricket News: వరల్డ్ కప్లో భారత్ తడబాటే కనిపించలేదన్న లారా.. సూర్య కెప్టెన్సీపై ప్రసిధ్ కామెంట్స్!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) భారత ఓటమిపై లారా విశ్లేషణ.. ఆసీస్తో టీ20 సిరీస్కు కెప్టెన్సీ చేపట్టిన సూర్యపై యువ బౌలర్ కామెంట్లు.. పాకిస్థాన్ బ్యాటర్పై పీసీబీ భారీ జరిమానా.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
సూర్య కెప్టెన్సీ కూడా అతడి బ్యాటింగ్లానే ఉంది: ప్రసిధ్
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్కు భారత కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచుల్లోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. రెండో టీ20 ముగిసిన తర్వాత భారత యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణ మాట్లాడుతూ.. సూర్య కెప్టెన్సీపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘‘సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే తీరు భిన్నంగా ఉంటుంది. అతడి కెప్టెన్సీ కూడా అలానే ఉంటుంది. జట్టులోని ప్రతి ఆటగాడిని విశ్వసిస్తాడు. మేం ఏం చేయాలని అనుకుంటామో దానికి మద్దతుగా నిలుస్తాడు. అందులో ఏదైనా పొరపాటు జరిగినా ఒత్తిడి చేయకుండా సపోర్ట్ చేస్తాడు. స్వేచ్ఛగా ఆడించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో అతడికి తెలుసు’’ అని ప్రసిధ్ తెలిపాడు.
వరల్డ్ కప్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన భారత్: లారా
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఆడినతీరు అద్భుతంగా ఉందని విండీస్ క్రికెట్ దిగ్గజం లారా ప్రశంసించాడు. ఆసీస్ వంటి బలమైన జట్టు చేతిలో ఓటమిపాలైనంత మాత్రాన భారత్ను తక్కువగా చూడటానికి వీల్లేదని పేర్కొన్నాడు. ‘‘వరల్డ్ కప్లో ఎక్కడా టీమ్ఇండియా తడబాటుకు గురైనట్లు కనిపించలేదు. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. అనుభవం ఎంత ముఖ్యమో ఈ వరల్డ్ కప్లో చూశాం. ఆసీస్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడినా.. చివరికి విజేతగా నిలిచింది. భారత్ అద్భుతంగా ఆడినా కొన్నిసార్లు ఓటమి ఎదురవ్వక తప్పదు. తప్పకుండా వరల్డ్ కప్ ఫైనల్ బెస్ట్ మ్యాచ్ అని చెప్పగలను. భారత్ గెలుస్తుందని నేనూ భావించా. దురదృవశాత్తూ ఓడిపోయింది. అయినా, తప్పకుండా వచ్చేసారి విజేతగా నిలుస్తుందన్న నమ్మకం నాకుంది’’ అని లారా వ్యాఖ్యానించాడు.
పాక్ బ్యాటర్పై జరిమానా
ఐసీసీ పరికరాల నిబంధనల ప్రకారం ప్లేయర్లు ఎవరూ తమ జెర్సీలపై రాజకీయపరమైన, మత, ప్రాంతీయ, జాతి వివక్షకు సంబంధించిన సందేశాలను డిస్ప్లే చేయకూడదు. అయితే, ఈ రూల్ను అతిక్రమించిన పాకిస్థాన్ యువ బ్యాటర్ అజమ్ ఖాన్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారీ జరిమానా విధించింది. తన బ్యాట్పై పాలస్తీనా జెండాను ప్రదర్శించడంతో మ్యాచ్ ఫీజ్లో 50 శాతం జరిమానా విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. జాతీయ టీ20 కప్ సందర్భంగా కరాచీ వైట్స్, లాహోర్ బ్లూస్ జట్ల మధ్య మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు కూడా గత రెండు మ్యాచుల్లోనూ ఇదే స్టిక్కర్లతో బరిలోకి దిగినట్లు అజమ్ పేర్కొన్నాడు. అప్పుడు అధికారులు ఎవరూ తనకు హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం