Ajaz Patel: అజాజ్ పటేల్ను పక్కనపెట్టిన న్యూజిలాండ్
ఇటీవల టీమ్ఇండియాతో జరిగిన ముంబయి టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల టీమ్ఇండియాతో జరిగిన ముంబయి టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. జిమ్లేకర్, అనిల్కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన బౌలర్గా నిలిచాడు. అంతటి గొప్ప ప్రదర్శన చేసిన ఆటగాడిని ఇప్పుడు కివీస్ జట్టు పక్కనపెట్టింది. జనవరి 1 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్కు సెలక్షన్ కమిటీ అజాజ్ను ఎంపిక చేయలేదు. మరోవైపు ఈ సిరీస్కు ఎంపిక చేసిన 13 మంది సభ్యుల్లో రచిన్ రవీంద్రను మాత్రమే ఏకైక స్పిన్నర్గా ఎంపిక చేశారు. అతడు ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత పర్యటనలో ఆకట్టుకున్నాడు.
మరోవైపు ఈ సిరీస్కు టామ్లాథమ్ న్యూజిలాండ్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్కు ఇదివరకే ఉన్న ఓ గాయం.. టీ20 ప్రపంచకప్ సందర్భంగా తిరగబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అతడు టీమ్ఇండియా పర్యటనలోనూ టీ20 సిరీస్లో బరిలోకి దిగలేదు. ఆపై కాన్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అనంతరం ముంబయిలో జరిగిన రెండో టెస్టులో పాల్గొనలేదు. ఆ సమయంలో టామ్ లాథమ్ నాయకత్వం వహించాడు. రాబోయే సిరీస్లోనూ అతడే జట్టును నడిపించనున్నాడు. కాగా, అజాజ్ భారత్లో అంత గొప్ప ప్రదర్శన చేసినా బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఈ విషయంపై స్పందించిన ఆ జట్టు కోచ్ గ్యారీస్టెడ్.. తాము పరిస్థితులకు తగ్గ ఆటగాళ్లనే ఎంపిక చేస్తామని చెప్పాడు. ‘భారత్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అజాజ్ను ఈ సిరీస్కు ఎంపిక చేయకపోవడంపై మీరు బాధపడొచ్చు. కానీ, మేం బంగ్లాదేశ్తో సిరీస్కు అవసరమైన ఆటగాళ్లనే ఎంపిక చేశాం. మా సెలక్షన్ పాలసీ ఎప్పుడూ ఇలానే ఉంటుంది’ అని వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి