India vs England: ఇలాంటి థ్రిల్లర్ మరెవ్వరి వల్లా కాదు!
క్రికెట్ మక్కా లార్డ్స్లో టీమ్ఇండియా అపూర్వ విజయాన్ని క్రికెట్ ప్రపంచం కీర్తిస్తోంది. క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు కోహ్లీసేనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆటగాళ్లు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించారని అంటున్నారు....
సచిన్, సౌరవ్, వీవీఎస్, సెహ్వాగ్ స్పందనలు ఇవీ!
లండన్: క్రికెట్ మక్కా లార్డ్స్లో టీమ్ఇండియా అపూర్వ విజయాన్ని క్రికెట్ ప్రపంచం కీర్తిస్తోంది. క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు కోహ్లీసేనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆటగాళ్లు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించారని అంటున్నారు. సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ సహా అనేక మంది టీమ్ఇండియాను పొగిడేస్తున్నారు.
🗨 ఇదో అద్భుతమైన టెస్టు మ్యాచ్! మ్యాచ్లో ప్రతి సందర్భాన్నీ ఆస్వాదించాను. కఠినమైన పరిస్థితుల్లో వారు తెగువను, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. అద్భుతంగా ఆడారు - సచిన్ తెందూల్కర్
🗨 టీమ్ఇండియా.. అద్భుతమైన విజయం. జట్టులోని ప్రతి ఒక్కరు తిరుగులేని తెగువ, పట్టుదల ప్రదర్శించారు. దగ్గర్నుంచి మిమ్మల్ని చూడటం ఎంతో సంతోషంగా ఉంది - సౌరవ్ గంగూలీ
🗨 టెస్టు క్రికెట్లో ఇదో అద్భుతమైన రోజు. ప్రతి భారతీయుడు ఎప్పటికీ గుర్తుంచుకొనే క్రికెట్ ఇది. బుమ్రా, షమి ఉదయం బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సిరాజ్, ఇషాంత్, బుమ్రా, షమి బంతితో తమ పవర్ చూపించారు. లార్డ్స్లో టీమ్ఇండియా సంచలన విజయం సాధించింది - వీవీఎస్ లక్ష్మణ్
🗨 గట్టెక్కితే చాలనుకున్న స్థితి నుంచి గెలుపు వైపు పయనించారు. లార్డ్స్లో ఆఖరి రోజు ఒక థ్రిల్లర్ను తలపించింది. టీమ్ఇండియాకు ఇది గొప్ప విజయం. ఈ మ్యాచ్ హైలైట్స్ను భవిష్యత్తులో పదేపదే చూస్తారు - దినేశ్ కార్తీక్
🗨 లార్డ్స్లో అద్భుతమైన టెస్టు మ్యాచ్. గొప్ప పిచ్పై టీమ్ఇండియా గొప్పగా క్రికెట్ ఆడింది. పట్టుదల ప్రదర్శించింది. వారు టాస్ ఓడి బ్యాటింగ్ చేశారని గుర్తుంచుకోవాలి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయారు. పంత్ ఔటవ్వగానే ఇంగ్లాండ్ గెలిచిందనుకున్నారు! కానీ టీమ్ఇండియా గొప్పగా ఆడింది. వారు ఈ విజయానికి అర్హులు. భారత్ 2-0తో గెలుస్తుంది! - షేన్ వార్న్
🗨 ఇదో అద్భుతమైన క్రికెట్.. ఇంగ్లాండ్ కన్నా తామెంతో మెరుగైన జట్టని టీమ్ఇండియా నిరూపించుకుంది. వారి గెలవాలన్న తపన మాత్రం ఊహించలేనిది - మైకేల్ వాన్
🗨 ఆఖరి రోజు ఆరంభంలో బతకగలమా అన్న పరిస్థితి! అలాంటిది లార్డ్స్లో విజయం సాధించేశారు. విదేశాల్లో టెస్టు మ్యాచుల్లో మనలా పుంజుకోవడం చాలా దేశాలకు కష్టం. కుర్రాళ్లు అద్భుతమే చేశారు. అందరూ అన్నట్టుగానే.. భారతీయులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు - వీరేంద్ర సెహ్వాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?