IND vs ENG: ఎలా పోరాడాలో టీమ్ఇండియాకు బాగా తెలుసు: సిల్వర్వుడ్
నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించడంపై ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్వుడ్ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయంలో క్రెడిటంతా కోహ్లీసేనకే దక్కుతుందని చెప్పాడు. భారత ఆటగాళ్లకు ఎలా పోరాడాలో తెలుసన్నాడు...
లండన్: నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించడంపై ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్వుడ్ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయంలో క్రెడిటంతా కోహ్లీసేనకే దక్కుతుందని చెప్పాడు. భారత ఆటగాళ్లకు ఎలా పోరాడాలో తెలుసన్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల కీలక ఆధిక్యం సాధించినా చివరికి సోమవారం 157 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన సిల్వర్వుడ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్లో తమకు సుమారు 200 పరుగుల ఆధిక్యం లభించి ఉంటే భారత్పై ఒత్తిడి తెచ్చేవాళ్లమని అన్నాడు.
‘నిజం చెప్పాలంటే తొలి ఇన్నింగ్స్లో మేం సాధించిన పరుగుల కన్నా ఇంకా ఎక్కువ స్కోర్ సాధించి ఉంటే టీమ్ఇండియాను మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశం మాకు దొరికేది. ఆ విషయంలో మేం విఫలమయ్యాం. దీనిపై డ్రెస్సింగ్రూమ్లో లోతుగా చర్చిస్తాం. వాళ్లకన్నా 190 పరుగుల ఆధిక్యం సంపాదించి ఉంటే కచ్చితంగా భారత్పై ఆధిపత్యం చెలాయించే అవకాశం దక్కేది. అయినా, ఈ విజయంలో క్రెడిటంతా టీమ్ఇండియాకే దక్కుతుంది. ప్రత్యర్థులపై తిరిగి ఎలా పోరాడాలో వాళ్లకు బాగా తెలుసు’ అని సిల్వర్వుడ్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్లో భారత్ తొలుత 191 పరుగులకు ఆలౌటవ్వగా ఇంగ్లాండ్ 290 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 99 పరుగుల కీలక ఆధిక్యం దొరికింది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(127), పుజారా(61), పంత్(50), శార్దూల్ ఠాకూర్(60) రాణించడంతో 466 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగి 210 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు రోరీబర్న్స్(50), హమీద్(63) మినహా ఇతరులంతా విఫలమయ్యారు. దీంతో భారత్ 157 పరుగుల తేడాతో నాలుగో టెస్టును ఖాతాలో వేసుకుంది. అలాగే ఐదు టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం