Ravi Shastri : అలా కుప్పకూలడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యాం : రవిశాస్త్రి
ఆస్ట్రేలియాపై 36 పరుగులకే టీమ్ఇండియా కుప్పకూలడమే తన...
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై 36 పరుగులకే టీమ్ఇండియా కుప్పకూలడమే తన పదవీకాలంలో అత్యంత దారుణమైన ప్రదర్శన అని భారత జట్టు ప్రధాన కోచ్గా పదవీవిరమణ చేసిన రవిశాస్త్రి తెలిపాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్గా టీమ్ఇండియా విదేశాల్లో అపూర్వమైన విజయాలను సాధించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మీద సిరీస్లను కైవసం చేసుకుంది. అయితే ఘన చరిత్ర కలిగిన రవిశాస్త్రి పదవీకాలంలో ఆసీస్పై ఓ టెస్టు మ్యాచ్ గణాంకాలు మాత్రం మాయనిమచ్చగా మిగిలిపోయింది. అడిలైడ్ వేదికగా గులాబీ బంతి టెస్టులో ఆస్ట్రేలియా మీద కేవలం 36 పరుగులకే టీమ్ఇండియా కుప్పకూలిన సంఘటన ప్రతి ఒక్కరికీ గుర్తే ఉండి ఉంటుంది. అత్యల్ప స్కోరు నమోదైన ఆ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. ఇదే తామందరిని షాక్కు గురి చేసిందని, దాంతో అందరం నిశ్చేష్టులయ్యామని చెప్పాడు. తన పదవీకాలంలో అత్యంత తక్కువస్థాయి ప్రదర్శన అని పేర్కొన్నాడు.
‘‘కోచ్ అనేవాడు ఎప్పుడూ విమర్శలకు సిద్ధంగా ఉండాలి. తప్పించుకునే మార్గాలు ఉండవని తెలుసు. ఆ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాం. కనీసం ఇంకో 80 పరుగులు చేస్తే గెలుపు కోసం పోరాడే అవకాశం ఉంది. అయితే కేవలం 36 పరుగులే చేశాం. దీంతో మేం ఒక్కసారిగా షాక్తో నిశ్చేష్టులయ్యాం. దీనికి నేనే మొదటి బాధ్యుడినని చెబుతా. తర్వాతి మ్యాచ్లకు సంబంధించి ఆటగాళ్లు ఏం చేయగలరో అదే చేయమని చెప్పా. దానిని ఆచరించి సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఎప్పటికీ ఆ సిరీస్ విజయం గురించి క్రికెట్ ప్రేమికులు మాట్లాడుకుంటారని ధీమాగా చెబుతున్నా’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
గులాబీ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ (74), రహానె (42), పుజారా (43) రాణించడంతో భారత్ 244 పరుగులు చేసింది. అనంతరం అశ్విన్ (4/55), ఉమేశ్ (3/40), బుమ్రా (2/52) విజృంభణతో 191 పరుగులకే ఆసీస్ ఆలౌటైంది. దీంతో భారత్కు 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు హేజిల్వుడ్ (5/8), కమిన్స్ (4/21) చెలరేగడంతో భారత్ కేవలం 36 పరుగులకే పరిమితమైంది. అనంతరం 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత టీమ్ఇండియా గొప్పగా పుంజుకుంది. రెండో టెస్టు, నాలుగో టెస్టుల్లో విజయం సాధించింది. మూడో టెస్టు డ్రాగా ముగియడంతో 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?