IND vs NZ : నేనెప్పుడూ దాని గురించే ఆలోచిస్తా: రోహిత్
టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న టీమ్ఇండియా ఇప్పుడు అదే జట్టుపై 3-0 తేడాతో గెలుపొంది సిరీస్ క్లీన్స్వీప్ చేసింది...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న టీమ్ఇండియా ఇప్పుడు అదే జట్టుపై 3-0 తేడాతో గెలుపొంది సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. దీంతో రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్గా తొలి సిరీస్లోనే అదరగొట్టాడు. అయితే, ఈ విజయంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారని రోహిత్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్మ్యాన్ సరైన శుభారంభం చేయడం ముఖ్యమని తెలిపాడు. ఎప్పుడూ అదే తన ఆలోచనా విధానమని తెలిపాడు. మ్యాచ్కు ముందు ఒకసారి పిచ్ను పరిశీలిస్తే ఏం చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందన్నాడు.
‘ఈరోజు మ్యాచ్లో మంచు ప్రభావం అధికంగా ఉండటంతో బంతి.. బ్యాట్పైకి బాగా వచ్చింది. మా బ్యాటింగ్ బృందం ఎలా ఆడాలనేదానిపై ముందే ప్రణాళికలు వేసుకున్నాం. అయితే, అది బాగా ఉపయోగపడిందని నేను అనుకోను. మిడిల్ ఆర్డర్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ ఈరోజు ఆడకపోయినా మంచి ఫామ్లో ఉన్నాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్కు ఈరోజు మినహా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సిరీస్ మొత్తంలో మా స్పిన్నర్లు బాగా రాణించారు. అశ్విన్, అక్షర్ బౌలింగ్ చేసిన తీరు బాగుంది. చాహల్ లయ అందుకున్నాడు. వెంకటేశ్ సైతం తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు’ అని రోహిత్ వివరించాడు.
అలాగే ఇతర జట్లలోని ఆటగాళ్లు 8, 9 స్థానాల వరకూ బాగా ఆడుతున్నారని కెప్టెన్ గుర్తుచేశాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియాలోనూ ప్రతి ఒక్కరు రాణించాలన్నాడు. హర్షల్ పటేల్ హరియాణా జట్టు తరఫున ఆడేటప్పుడు ఓపెనింగ్ చేస్తాడని, అలాగే దీపక్ చాహర్ శ్రీలంక పర్యటనలో ఎలా బ్యాటింగ్ చేశాడో మనం చూశామన్నాడు. యుజువేంద్ర చాహల్ సైతం బ్యాటింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని రోహిత్ తెలిపాడు. ఇక చివరగా తన పుల్షాట్పై స్పందించిన హిట్మ్యాన్.. ఆ షాట్ సహజంగా రాదని, దానికోసం ఎంతో సాధన చేశానని స్పష్టం చేశాడు. ఒక్కోసారి ఆ షాట్ బాగా పడుతుందని, ఒక్కోసారి కుదరదని తెలిపాడు. అందువల్లే కొన్నిసార్లు తాను ఆ షాట్ ఆడబోయి ఔటౌతానని వివరించాడు. కాబట్టి, ఎవరికైనా మంచి నైపుణ్యం ఉంటే దానిపై దృష్టిసారించాలని సూచించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.