Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ.. తొలిసారి హిమాచల్ ప్రదేశ్ సొంతం
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. విజయ్ హజారే 2021 - 2022 ట్రోఫీని...
ఫైనల్ మ్యాచ్లో తమిళనాడుపై విజయం
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. విజయ్ హజారే 2021- 2022 ట్రోఫీని కైవసం చేసుకుంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో తమిళనాడుపై విజయం సాధించి తొలిసారి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 47.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఈ సమయంలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్ను ముగించాలని నిర్ణయించారు. దీంతో విజేడీ సూత్రం ప్రకారం విజయానికి హిమాచల్ ప్రదేశ్ 288 పరుగులు చేస్తే సరిపోతుంది. అప్పటికే హిమాచల్ 299/4 స్కోరుతో ఉండటంతో 11 పరుగుల తేడాతో గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో దేశవాళీ పోటీల్లో తొలిసారి హిమాచల్ ప్రదేశ్ మొదటి ట్రోఫీని అందుకుంది. హిమాచల్ బ్యాటర్లలో ఓపెనర్ శుభమ్ అరోరా (136 నాటౌట్: 13x4,1x6) అద్భుత శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అమిత్ కుమార్ (74), రిషి ధావన్ (42 నాటౌట్) రాణించారు. ప్రశాంత్ చోప్రా 21, నిఖిల్ 18 పరుగులు సాధించారు. తమిళనాడు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, మురుగన్ అశ్విన్, బాబా తలో వికెట్ తీశారు.
శతకంతో ఆదుకున్న సీనియర్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన తమిళనాడుకు శుభారంభం దక్కలేదు. 40 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే దినేశ్ కార్తిక్ (116), ఇంద్రజిత్ (80) ఎంతో ఓపిగ్గా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు 198 పరుగులు జోడించారు. దాదాపు 26 ఓవర్లపాటు బ్యాటింగ్ చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కార్తిక్, ఇంద్రజిత్ పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ (42), కెప్టెన్ విజయ్ శంకర్ (22) ధాటిగా ఆడారు. కేవలం 4.5 ఓవర్లలో అర్ధశతక (53) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో తమిళనాడు స్కోరు 300 దాటింది. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ 4, రిషి ధావన్ 3.. దిగ్విజయ్, వినయ్, సిద్ధార్థ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.