Virat Kohli: ఈ సిరీస్ మొత్తం మేం 4-1 కాంబినేషన్ పాటిస్తాం: కోహ్లీ
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా మిగతా మ్యాచ్ల్లోనూ 4-1 కాంబినేషన్ పాటిస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలి టెస్టు రద్దు అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన అతడు ప్రతి మ్యాచ్లోనూ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్ను తీసుకుంటామని చెప్పాడు. అదే
నాటింగ్హామ్: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా మిగతా మ్యాచ్ల్లోనూ 4-1 కాంబినేషన్ పాటిస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలి టెస్టు రద్దు అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన అతడు ప్రతి మ్యాచ్లోనూ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్ను తీసుకుంటామని చెప్పాడు. అదే నిజమైతే ఇక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది.
‘ఈ మ్యాచ్లో వర్షం మూడు, నాలుగు రోజుల్లో పడుతుందని మేం ఆశించాం. కానీ, అది ఐదో రోజున పడింది. చివరి రోజు ఆట జరిగి ఉంటే ఎంతో బాగుండేది. అయితే, అదలా జరగలేదు. బాధగా ఉంది. అలాగే మేం మ్యాచ్లో బలమైన ఓపెనింగ్ చేయాలనే అనుకున్నాం. దాంతో ఐదోరోజు మాకు విజయావకాశాలు ఉంటాయని భావించాం. ఈ క్రమంలోనే నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి మ్యాచ్పై పట్టు సాధించామని అనుకున్నాం. మరోవైపు మేం తొలి ఇన్నింగ్స్లో 40 పరుగుల ఆధిక్యం అలా సాధిస్తామని అనుకున్నాం. కానీ, అది 95 పరుగులకు చేరింది. ఆ లీడ్ మాకెంతో కీలకమైనా చివరి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడం బాధాకరం’ అని కోహ్లీ విచారం వ్యక్తం చేశాడు.
చివరి రోజు టీమ్ఇండియా విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌటవ్వడంతో భారత్ లక్ష్యం 209 పరుగులుగా నమోదైంది. నాలుగో రోజు మూడో సెషన్లో ఛేదనకు దిగిన టీమ్ఇండియా శనివారం ఆట నిలిచిపోయేసరికి 52/1తో నిలిచింది. రాహుల్(26) ఔటైనా రోహిత్ (12), పుజారా(12) నాటౌట్గా నిలిచారు. ఈ క్రమంలోనే చివరి రోజు భారత్ మరో 157 పరుగులు చేయాల్సి ఉంది. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో ఆదివారం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?