Tokyo olympics: నేటి భారతం.. శరత్ కమల్ ఇంటికి.. సాత్విక్ జోడీ గెలుపు.. గురి తప్పిన షూటింగ్
టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల మోస్తరు ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ప్రధాన క్రీడల్లో మిశ్రమ ఫలితాలే కనిపించాయి. భారీ ఆశలు పెట్టుకున్న షూటింగ్లో నిరాశే ఎదురైంది. టేబుల్ టెన్నిస్లో భారత్ కథ ముగిసింది....
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల మోస్తరు ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ప్రధాన క్రీడల్లో మిశ్రమ ఫలితాలే కనిపించాయి. భారీ ఆశలు పెట్టుకున్న షూటింగ్లో నిరాశే ఎదురైంది. టేబుల్ టెన్నిస్లో భారత్ కథ ముగిసింది. బ్యాడ్మింటన్, హాకీలో పురుషుల జట్లు విజయాలు నమోదు చేశాయి.
⇒ హాకీలో భారత పురుషుల జట్టు మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. చివరి మ్యాచులో 1-7 తేడాతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమ్ఇండియా ఈ సారి బలంగా పుంజుకుంది. పూల్-ఏ మూడో మ్యాచులో స్పెయిన్పై ఘన విజయం సాధించింది. 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. సిమ్రన్జీత్ సింగ్ (14వ నిమిషం), రూపిందర్పాల్ సింగ్ (15ని, 51ని) చక్కని గోల్స్తో ఆకట్టుకున్నారు.
⇒ భారత్ అతిగా ఆశలు పెట్టుకున్న క్రీడ షూటింగ్. మిక్స్డ్ విభాగాల్లో కచ్చితంగా పతకాలు వస్తాయనే విశ్వసించారు. కానీ, 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ పోటీల్లో మనుబాకర్, సౌరభ్ చౌదరి విఫలమయ్యారు. స్టేజ్-1లో 586-26Xతో అగ్రస్థానంలో నిలిచిన వీరు స్టేజ్-2లో 380-11Xతో ఏడో స్థానానికి పరిమితం అయ్యారు.
⇒ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలోనూ పేలవ ప్రదర్శన కొనసాగింది. వలరివన్ ఎలవెనిల్, దివ్యాన్ష్ సింగ్ జోడీ 626.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. అంజుమ్ మౌద్గిల్, దీపక్ కుమార్ జంట 623.8 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.
⇒ పురుషుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ మూడో రౌండ్లో భారత వెటరన్ శరత్ కమల్ ఓటమి పాలయ్యాడు. ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ విజేత మా లాంగ్తో జరిగిన పోరులో 1-4 తేడాతో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్లో 7-11తో వెనకబడిన అతడు 11-8తో రెండే గేమ్ కైవసం చేసుకున్నాడు. మూడో గేమ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డా 13-11తో లాంగ్దే విజయం. ఆ తర్వాత అతడు మరింత విజృంభించి 11-4, 11-4తో మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
⇒ బ్యాడ్మింటన్లో పురుషుల డబుల్స్లో భారత్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తోంది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ గ్రూప్-ఏ మ్యాచులో విజయం సాధించింది. లేన్ బెన్, వెండీ సేన్తో జరిగిన పోరులో 2-0తో ఘన విజయం సాధించింది. 21-17, 21-19తో రెండు గేములను కైవసం చేసుకుంది. కాగా, సెయిలింగ్ పోటీల్లో శరవణన్ విష్ణు, నేత్ర తమ సామర్థ్యం మేరకు ఆడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక