కోహ్లీ బుట్టలో పడని కైల్ జేమీసన్
ఐపీఎల్ 14వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే, ఇక్కడ కూడా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) గురించి ఆలోచిస్తున్నాడని తెలిసింది...
ఐపీఎల్లో టెస్టు ఛాంపియన్షిప్ మాటలు.
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే, ఇక్కడ కూడా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) గురించి ఆలోచిస్తున్నాడని తెలిసింది. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి న్యూజిలాండ్తో టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ మ్యాచ్లో డ్యూక్ బాల్స్ను వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే అక్కడ రాణించడానికి కోహ్లీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అందుకు సంబంధించిన ఓ ఉదాహరణను ఆర్సీబీ ఆల్రౌండర్ డానియల్ క్రిస్టియన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నాడు.
‘విరాట్ చాలా తెలివైన వాడు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలో నేనూ, అతడు, కైల్ జేమీసన్ నెట్స్లో సాధన చేసి ఓ చోట కూర్చున్నాం. ఆ సమయంలో వాళ్లిద్దరూ టెస్టు క్రికెట్ గురించి మాట్లాడుకున్నారు. అప్పుడే జేమీసన్ తన వద్ద డ్యూక్ బాల్స్ ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వాటిని తీసుకొచ్చానని అన్నాడు. దాంతో కోహ్లీ.. జేమీని తన బుట్టలో వేసుకోవాలని చూశాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ బంతులను తనకు వేయమని కోహ్లీ అడిగాడు. కానీ, అలా చేయనని న్యూజిలాండ్ పేసర్ జవాబిచ్చాడు’ అని క్రిస్టియన్ పేర్కొన్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగిందన్నాడు.
కోహ్లీ: జేమీ నువ్వు డ్యూక్ బాల్స్తో ఎక్కువగా బౌలింగ్ చేశావా?
జేమీ: అవును చేశాను. ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసేందుకు కొన్ని బంతులు తీసుకొచ్చాను. టెస్టు ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లాండ్కు వెళ్లేముందు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా.
కోహ్లీ: కావాలంటే ఇక్కడ నెట్స్లో ఆ బంతులతో నువ్వు నాకు బౌలింగ్ చేయొచ్చు. వాటితో నీ బౌలింగ్ను ఎదుర్కోడానికి చాలా సంతోషిస్తా.
జేమీ: అలాంటి అవకాశమే లేదు. నేను నీకు బౌలింగ్ చేయను.
జేమీసన్ బౌలింగ్ చేసి ఉంటే డ్యూక్ బాల్స్తో అతడి బౌలింగ్ శైలిని కోహ్లీ గమనించేవాడని క్రిస్టియన్ అభిప్రాయపడ్డాడు. కాగా, గతేడాది టీమ్ఇండియా.. న్యూజిలాండ్ పర్యటనలో అద్భుత బౌలింగ్ చేసిన జేమీసన్.. కోహ్లీతో సహా పలువురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ కివీస్ పేసర్ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇక్కడ అతడు అనుకున్నంత మేర రాణించలేకపోతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.