
Kohli : అర్థం చేసుకోవడం కష్టం.. ఆర్సీబీ కెప్టెన్సీని త్యజించడంపై కోహ్లీ వ్యాఖ్యలు
ఇంటర్నెట్ డెస్క్: గత సీజన్ ఐపీఎల్ పోటీలు ముగిసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. నాయకత్వ బాధ్యతలను వదులుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రికెటర్లు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవడం సాధారణ పౌరులకు కష్టమని అభిప్రాయపడ్డాడు. ‘‘అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేనప్పుడు ఇటువంటి నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టతరం. బయట నుంచి భారీ అంచనాలు పెట్టుకుంటారు. ‘ఇది ఎలా జరిగింది.. మేమంతా షాక్కు గురయ్యాం..’ వంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. అయితే నా వరకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. అప్పటికే అభిమానులకు వివరించాను. నాకు కొంచెం విరామం కావాలి. పనిభారం నిర్వహణ కోసమే నిర్ణయం తీసుకున్నా. ఇక అంతటితో ముగిసిపోయింది’’ అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి మొన్నటి వరకు జరిగిన టోర్నమెంట్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్ సాధించలేకపోయింది. సీనియర్లు ఉన్నప్పటికీ ఛాంపియన్గా నిలవడంలో విఫలమైంది. ఇటువంటి సమయంలో కోహ్లీ కెప్టెన్సీని వదిలిపెట్టడంతో విభిన్న వాదనలు వినిపించాయి. అయితే వాటన్నింటినీ కొట్టిపడేశాడు. ‘‘బయట జరుగుతున్న వాదోపవాదాల గురించి నేను ఆలోచించను. నా జీవితం సింపుల్గా ఉండేలా చూసుకుంటాం. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తానో... అప్పుడే ఓ నిర్ణయానికొచ్చా. దానిని ప్రకటించా. కొన్నాళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నాణ్యతే ముఖ్యం కాని ఎన్ని మ్యాచ్లు ఆడామనేది ముఖ్యం కాదని అనుకుంటా. అయితే నేనెవరిని..? నేనెక్కడ ఉన్నాను..? అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. నేను ఎల్లవేళలా నాలానే ఉంటా. అందుకేనేమో అభిమానులతో చాలా క్లోజ్గా కనెక్ట్ కాగలిగాను’’ అని కోహ్లీ వివరించాడు. కష్టపడటంలో గణాంకాలను చూడాలి కానీ, అమలు పరచడంలో నాణ్యతే కీలకమని చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
-
Crime News
Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
-
Viral-videos News
Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
-
Politics News
Revanth Reddy: మానవత్వం లేకుండా వెంకట్పై పోలీసులు దాడి చేశారు: రేవంత్రెడ్డి
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
General News
Health: ఆహారం కలుషితమై వాంతులు, విరేచనాలా..? అయితే ఇలా చేయండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్హ్యాట్
- Mahesh babu: బిల్ గేట్స్తో మహేశ్బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?