Kohli : అర్థం చేసుకోవడం కష్టం.. ఆర్సీబీ కెప్టెన్సీని త్యజించడంపై కోహ్లీ వ్యాఖ్యలు
గత సీజన్ ఐపీఎల్ పోటీలు ముగిసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి ...
ఇంటర్నెట్ డెస్క్: గత సీజన్ ఐపీఎల్ పోటీలు ముగిసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. నాయకత్వ బాధ్యతలను వదులుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రికెటర్లు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవడం సాధారణ పౌరులకు కష్టమని అభిప్రాయపడ్డాడు. ‘‘అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేనప్పుడు ఇటువంటి నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టతరం. బయట నుంచి భారీ అంచనాలు పెట్టుకుంటారు. ‘ఇది ఎలా జరిగింది.. మేమంతా షాక్కు గురయ్యాం..’ వంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. అయితే నా వరకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. అప్పటికే అభిమానులకు వివరించాను. నాకు కొంచెం విరామం కావాలి. పనిభారం నిర్వహణ కోసమే నిర్ణయం తీసుకున్నా. ఇక అంతటితో ముగిసిపోయింది’’ అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి మొన్నటి వరకు జరిగిన టోర్నమెంట్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్ సాధించలేకపోయింది. సీనియర్లు ఉన్నప్పటికీ ఛాంపియన్గా నిలవడంలో విఫలమైంది. ఇటువంటి సమయంలో కోహ్లీ కెప్టెన్సీని వదిలిపెట్టడంతో విభిన్న వాదనలు వినిపించాయి. అయితే వాటన్నింటినీ కొట్టిపడేశాడు. ‘‘బయట జరుగుతున్న వాదోపవాదాల గురించి నేను ఆలోచించను. నా జీవితం సింపుల్గా ఉండేలా చూసుకుంటాం. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తానో... అప్పుడే ఓ నిర్ణయానికొచ్చా. దానిని ప్రకటించా. కొన్నాళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నాణ్యతే ముఖ్యం కాని ఎన్ని మ్యాచ్లు ఆడామనేది ముఖ్యం కాదని అనుకుంటా. అయితే నేనెవరిని..? నేనెక్కడ ఉన్నాను..? అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. నేను ఎల్లవేళలా నాలానే ఉంటా. అందుకేనేమో అభిమానులతో చాలా క్లోజ్గా కనెక్ట్ కాగలిగాను’’ అని కోహ్లీ వివరించాడు. కష్టపడటంలో గణాంకాలను చూడాలి కానీ, అమలు పరచడంలో నాణ్యతే కీలకమని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం