WI vs IND: టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వెస్టిండీస్ విజయం
వెస్టిండీస్ పర్యటనలో భారత్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియాపై కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బార్బడోస్: వెస్టిండీస్ పర్యటనలో భారత్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియాపై కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. తొలుత విండీస్ బౌలర్ల ధాటికి టీమ్ఇండియా 181 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55), శుభ్మన్ గిల్ (34) మాత్రమే రాణించారు. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో షై హోప్ (63*; 80 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకం బాదాడు. కార్టీ (48*; 65 బంతుల్లో 4 ఫోర్లు), కైల్ మేయర్స్ (36) కూడా మెరిశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం (ఆగస్టు 01)న జరగనుంది.
మోస్తరు లక్ష్యఛేదనలో విండీస్కు ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (15), కైల్ మేయర్స్ శుభారంభం అందించారు. బ్రెండన్ నెమ్మదిగా ఆడినా కైల్ మేయర్స్ దూకుడు ప్రదర్శించాడు. ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు.. హార్దిక్ పాండ్య బౌలింగ్లో ఓ బంతిని నేరుగా బౌండరీ అవతలికి పంపించాడు. మేయర్స్ దూకుడుకు శార్దూల్ ఠాకూర్ చెక్ పెట్టాడు. అతడు వేసిన తొమ్మిదో ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాదిన విండీస్ ఓపెనర్ తర్వాతి బంతికే ఉమ్రాన్ మాలిక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శార్దూల్ అదే ఓవర్లో బ్రెండన్ కింగ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కొద్దిసేపటికే శార్దూల్ బౌలింగ్లోనే అథనేజ్ (6) కూడా పెవిలియన్ చేరాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మయర్ (9)ని కుల్దీప్ యాదవ్ క్లీన్బౌల్డ్ చేయడంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న షై హోప్.. కార్టీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. భారత బౌలర్లు వికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. ఎక్కువగా సింగిల్స్ తీస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. హోప్ 70 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ బౌలింగ్లో కార్టీ వరుసగా రెండు ఫోర్లు బాది విండీస్కు విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ అదిరే ఆరంభం అందిచారు. వీరిద్దరూ నిలకడ ఆడటంతో 90 పరుగుల వరకు వికెట్టే పడలేదు. కానీ ఆ తర్వాతే కథ మలుపుతిరిగింది. 91 పరుగుల వ్యవధిలో 10 వికెట్లనూ కోల్పోయి 181 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్, గిల్ వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. అక్షర్ పటేల్ (1), సంజు శాంసన్ (9), కెప్టెన్ హార్దిక్ పాండ్య (7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కేవలం 13 పరుగుల వ్యవధిలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 90/0 నుంచి 113/5కు చేరుకుంది.
ఈ క్రమంలోనే వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గి మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. ఆదుకుంటారనుకున్న జడేజా (10), సూర్యకుమార్ కూడా పెవిలియన్ చేరారు. కాసేపు నిలకడగా ఆడిన శార్దూల్ ఠాకూర్ (16) జోసెఫ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత ఉమ్రాన్ మాలిక్ (0), ముకేశ్ కుమార్ (6) వెనుదిరగడంతో భారత్ ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 3, మోతీ 3, జోసెఫ్ 2, సీల్స్, కరియా ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
టీ20 వరల్డ్కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశాడు. -
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
తొలిసారి అమెరికా వేదికగా టీ20 ప్రపంచ కప్ సంగ్రామం జరగనున్న నేపథ్యంలో యువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. యూఎస్ఏతోపాటు విండీస్ కూడా ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. -
క్రికెట్లో ‘కష్టమైన బంతి’ అంటూ ఏమీ ఉండదు..: గంభీర్
భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న క్రికెటర్ ఆరంభంలో ఇబ్బందిపడినా.. జట్టుకు అవసరమైన సమయంలో తమ సత్తా చాటితేనే ‘స్టార్’గా మారతాడు. -
ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్ప్రీత్ బుమ్రా
ప్రాక్టికల్గా ఉండేందుకు ఇష్టపడే జస్ప్రీత్ బుమ్రా తన జూనియర్లకు అవసరమైన సమాచారం మాత్రమే ఇస్తాడు. అయితే, ఎలాంటి ప్రశ్న అడిగినా స్పందిస్తానని.. అతిగా మాత్రం బదులివ్వనని బుమ్రా వ్యాఖ్యానించాడు. -
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
భారత ప్రధాన కోచ్గా ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జులై 1 నుంచి ఈ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. -
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
Shubman Gill: క్రికెటర్ శుభ్మన్ గిల్ను తాను పెళ్లి చేసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై టీవీ నటి రిధిమా పండిత్ స్పష్టనిచ్చింది. -
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి కారణమేంటనేది తాజాగా వెల్లడించాడు. -
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..
రెండోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవాలనే లక్ష్యంతో టీమ్ఇండియా బరిలోకి దిగింది. అయితే, తొలిసారి ఛాంపియన్గా నిలిచిన ఆ జట్టుకు.. ఇప్పుడు రోహిత్ సేనకు మధ్య ఉన్న పోలికలు ఏంటో ఓ లుక్కేద్దాం.. -
పాండ్య ‘బ్యాకప్’ పేసర్.. బౌలింగ్ కాంబినేషన్ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్
రెండోసారి ఛాంపియన్గా నిలిచేందుకు భారత బరిలోకి దిగింది. మరో నాలుగు రోజుల్లో తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్తో కీలక పోరు జరగనుంది. -
అప్పుడు వర్కౌట్ కాలేదు.. ఈసారైనా సీనియర్లు ముందుండాలి: మంజ్రేకర్
సీనియర్లపై ఉంచిన నమ్మకాన్ని ఈసారి వమ్ము కానివ్వకుండా కప్ను అందించాలని భారత మాజీ క్రికెటర్ సూచించాడు. అలాగే పాక్తో ఇద్దరిని అడ్డుకోగలిగితే మరోసారి ఆధిపత్యం ప్రదర్శించవచ్చని పేర్కొన్నాడు. -
కిక్ అంతా ఇక్కడే..
ప్రపంచకప్ ఏదైనా ఆ రెండు జట్ల మధ్య పోరు గురించే చర్చంతా! ఆ చిరకాల ప్రత్యర్థులు తలపడితే క్రికెట్ ప్రపంచమే ఊగిపోతుంది! ఇప్పుడు టీ20 ప్రపంచకప్లోనూ అందరూ ఎదురుచూస్తోంది ఆ దాయాది దేశాల మధ్య సమరం గురించే! ఆ జట్లే.. భారత్, పాకిస్థాన్. -
భారత అభిమానుల కోసం
ఐసీసీ టోర్నీలైనా, ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్లైనా అత్యధిక ఆదాయం, ఆదరణ దక్కేది భారత్ నుంచే. -
సెమీస్లో గాయత్రి జోడీ
సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. -
భారత్ బంగ్లాదేశ్.. ప్రాక్టీస్ మ్యాచ్ నేడు
ఐపీఎల్లో భారత ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడారు. ఆయా జట్ల తరపున రాణించారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్కు ముందు ఈ ఆటగాళ్లంతా జట్టుగా కలిసేందుకు, సమష్టిగా సత్తాచాటేందుకు చివరి అవకాశం. -
ప్రిక్వార్టర్స్లో గాఫ్
ఫ్రెంచ్ ఓపెన్లో అమెరికా తార కొకోగాఫ్ దూసుకెళ్తోంది. ఆమె ఎక్కువగా కష్టపడకుండానే ప్రిక్వార్టర్స్ చేరింది. -
పతాకధారిని అంటే నమ్మలేకపోయా
పారిస్ ఒలింపిక్స్లో పతాకధారిని తానేనని తెలియగానే నమ్మలేకపోయానని భారత టేబుల్టెన్నిస్ స్టార్ ఆచంట శరత్కమల్ అన్నాడు. -
నిశాంత్కు పారిస్ కోటా
భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని దక్కించుకున్నాడు. -
రిషితకు ఐటీఎఫ్ టైటిల్
ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి రిషితరెడ్డి విజేతగా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే