Rohit Sharma : టీమ్ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడమే మా లక్ష్యం : రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడమే తమ లక్ష్యమని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. త్వరలో పలు ఐసీసీ ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం తమ దృష్టంతా వాటిని..

Published : 13 Dec 2021 20:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడమే తమ లక్ష్యమని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. త్వరలో పలు ఐసీసీ ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం తమ దృష్టంతా వాటిని సాధించడంపైనే కేంద్రీకరించామని పేర్కొన్నాడు. అలాగే, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి అని రోహిత్‌ అన్నాడు. 

‘త్వరలో పలు ఐసీసీ టోర్నీలు ప్రారంభం కానున్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు మేమంతా సమష్టిగా కష్టపడుతున్నాం. ప్రపంచకప్‌ సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా సిద్ధం అవుతున్నాం. ఆటగాళ్లంతా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మా దృష్టంతా మెగా టోర్నీల్లో విజయం సాధించడంపైనే కేంద్రీకరించాం. టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడమే మా లక్ష్యం’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

‘కోచ్‌కి, కెప్టెన్‌కి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే, ఆటగాళ్లను జట్టులోకి ఎందుకు తీసుకున్నామో, జట్టులో వారి పాత్రేంటో స్పష్టంగా వివరించగలం. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ కోసం కోచ్‌ రాహుల్‌ భాయ్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి. గతంలో నా ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు చాలా సార్లు అతడితో మాట్లాడాను. ప్రస్తుతం అతడే జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండటం మా జట్టుకు కలిసొచ్చే అంశం. ద్రవిడ్ నేతృత్వంలో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు వస్తాయనకుకుంటున్నాను’ అని రోహిత్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని