WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధికి మార్గం: బిన్నీ
మహిళా క్రికెటర్ల కోసం బీసీసీఐ (BCCI) నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఆరంభంలోనే రికార్డు సృష్టించింది. ఫ్రాంచైజీల హక్కుల కోసం బిడ్డింగ్లను నిర్వహించగా.. భారీ ధరకు అమ్ముడు కావడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్ర సృష్టించింది. ఐదు ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన బిడ్డింగ్లను బీసీసీఐ (BCCI) ఇప్పటికే వెల్లడించింది. ఐదేళ్లపాటు హక్కుల కోసం రూ. 4,669.99 కోట్లతో ఐదు ఫ్రాంచైజీలను పలు సంస్థలు సొంతం చేసుకొన్నాయి. మొదటిసారి ఐపీఎల్ (IPL 2008) హక్కుల కోసం పోటీపడిన మొత్తం కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఐదు ఫ్రాంచైజీల యాజమాన్యాలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. భారత్లోని మహిళల క్రికెట్కు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకొనేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.
‘‘ఐదు ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్న విజేతలకు శుభాకాంక్షలు. భారత్తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్లేయర్లు ఒకరినొకరు నేర్చుకొనేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ చక్కగా ఉపయోగపడుతుంది. అట్టడుగు స్థాయి నుంచి మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవడంతోపాటు ఎక్కువ మంది మహిళలను క్రికెట్ వైపు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. బిడ్డింగ్ ప్రక్రియ సాఫీగా సాగిపోవడానికి కృషి చేసిన బీసీసీఐ బృందం సభ్యులకు నా అభినందనలు. అంతర్జాతీయంగా మన మహిళా క్రికెటర్లు రాణించడానికి తప్పకుండా ఈ లీగ్ సాయపడుతుందని ఆశిస్తున్నా’’ అని రోజర్ బిన్నీ తెలిపాడు. మార్చి రెండో వారంలో మహిళా లీగ్ను నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్లకు సంబంధించిన వేలంను త్వరలోనే బీసీసీఐ నిర్వహించనుంది.
నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు: మిథాలీ రాజ్
ఫ్రాంచైజీలపై హక్కుల కోసం దాదాపు రూ. 4,700 కోట్లు వెచ్చించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. రికార్డు బ్రేక్ చేసిందని కొందరు సంబరపడుతుంటే.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్రం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మేరకు ట్విటర్లో పేర్కొంది. ‘‘తొలి మహిళల ప్రీమియర్లీగ్ నిర్వహణ ప్రారంభంలోనే రికార్డు సాధించడం అద్భుతం. ఇంతకంటే తక్కువేమీ ఆశించలేదు. మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం’’ అని మిథాలీ రాజ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం