మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు..
టీమ్ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ధనశ్రీ అనే ఓ యూట్యూబర్తో మంగళవారం చడీచప్పుడు లేకుండా వివాహమైంది...
చాహల్-ధనశ్రీ చిత్ర మాలిక..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ధనశ్రీ అనే ఓ యూట్యూబర్తో మంగళవారం వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని అతడే సామాజిక మాధ్యమాల్లో వెల్లడించే వరకు ఎవరికీ తెలియదు. అయితే, ఈ చూడ ముచ్చటైన జంట ఒక్కటవ్వడానికి ఆగస్టులోనే ముహూర్తం ఖరారైంది. అప్పుడు కూడా చాహల్ ఇలాగే సడెన్గా ధనశ్రీని పరిచయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అతడు బిజీకావడంతో అప్పుడప్పుడూ ఆమెతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు షేర్ చేసిన పలు చిత్రాలు మీకోసం..
అవును ఓకే చెప్పాం..
ధనశ్రీతో తన పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చాహల్ ఆగస్టు 8న సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన కాబోయే సతీమణిని అందరికీ పరిచయం చేశాడు.
స్వాతంత్ర్య దినోత్సవ వేళ..
భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీ. కళ్లద్దాలు పెట్టుకొని, తెల్లదుస్తుల్లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
నా మదిని దోచింది నువ్వే..
నా మదిని దోచిన అమ్మాయి నువ్వే అంటూ ధనశ్రీతో అదిరిపోయే సెల్ఫీ తీసుకున్న యూజీ. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన సందర్భంగా హోటల్లో తీసుకున్న ఫొటో
నువ్విచ్చిన చిరునవ్వే..
ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతుండగానే ఓ సందర్భంలో తాము బస చేస్తున్న హోటల్లో సరదాగా మెట్లపై తీసుకున్న చిత్రమిది.
అనుకోని సెలబ్రేషన్స్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడేటప్పుడు ఓ సందర్భంలో అనుకోకుండా జరుపుకొన్న సెలబ్రేషన్స్. మైదానంలో చాహల్ బౌలింగ్ చేస్తున్న ఆకృతిలో రూపొందించిన కేక్తో యువ జంట.
అందమైన సాయం కాలం..
ఓ అందమైన సాయంకాలం సముద్రపు ఒడ్డున ప్రేమ పక్షుల్లా సరదాగా తీసుకున్న చిత్రం. నీవెంటే నేనుంటా అంటూ తన ప్రియసఖితో ప్రేమగా తీసుకున్న సుందర దృశ్యం.
ఐపీఎల్ ముగిశాక..
యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ ముగిశాక ఓ రాత్రివేళ పడవలో తీసుకున్న అందమైన ఫొటో. సముద్రపు జలాల్లో వెనుకవైపు లైట్ల కాంతుల్లో మెరిసిపోతున్న అందమైన కట్టడాల మధ్య చాహల్, ధన.
ఎంజాయ్ హాలిడే..
ఐపీఎల్ పూర్తయ్యాక ఓ హాలిడే సందర్భంగా అల్పాహారం తీసుకుంటున్న చిత్రం. హోటల్ గది నుంచి వెనుక వైపు చూస్తే ప్రశాంతమైన సముద్రపు జలాలు. ఇదో ప్రత్యేకమైన ఫొటో.
ఆహా అనిపించే సెల్ఫీ..
సెల్ఫీ అంటే ఎవరికి ఇష్టముండదు అనేట్లుగా తీసుకున్న స్వీయ చిత్రం. ప్రశాంతమైన సముద్ర జలాల పక్కన తెల్లటి ఇసుక రేణువుల్లో ఆహా అనిపించే తీపిగుర్తు.
శతమానం భవతి..
బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికి.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వేళ. శతమానం భవతి అంటూ అందరూ దీవించే మధుర క్షణాల వేళ తీసిన చిత్రం.
ఇవీ చదవండి..
కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !
2020.. కోహ్లీ ఏంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?