El Nino: ఎల్నినో కథ
ఎల్నినో. పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ కాలేజ్ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం.
ఎల్నినో. పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ కాలేజ్ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.281 లక్షల కోట్ల నష్టం సంభవించొచ్చనీ పేర్కొంటోంది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఎల్నినో అంటే ఏంటి? ఎందుకొస్తుంది?
పగలు, రాత్రి.. రోజులు దొర్లుతుంటాయి. ఎండ, వాన, చలి.. కాలాలు, రుతువులు మారుతుంటాయి. అన్నీ ఒక వలయంగా వస్తూ, పోతుంటాయి. భూమ్మీద జీవనం వీటి మీదే ఆధారపడి నడుస్తుంది. ఇలాంటి మార్పులు చాలావరకు కొద్ది వ్యవధులకే పరిమితమవుతుంటాయి. వీటిని కచ్చితంగా అంచనా వేయొచ్చు. రాత్రి ఎప్పుడవుతుందో, ఉదయం ఎప్పుడు మొదలవుతుందో చెప్పొచ్చు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎప్పుడొస్తాయో, ఎప్పుడు ముగుస్తాయో ముందే అవగతమైపోతుంది. అయితే మంచుయుగం వంటి కొన్ని మార్పుల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని అంచనా వేయటం అంత తేలిక కాదు. కానీ వాతావరణం, జీవజాతుల మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పులతో సంభవించే ఎల్నినో అలాంటిదే.
సముద్రాలు వాతావరణం
మహా సముద్రాలు, వాతావారణానికి మధ్య విడదీయరాని సంబంధముంది. పసిఫిక్ మహా సముద్రం విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్నినో పుట్టేదే ఇక్కడే మరి. భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన అటూఇటూ సుమారు 30 డిగ్రీల మధ్య ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలంటారు. భూభ్రమణం మూలంగా ఇక్కడ గాలి భూమధ్యరేఖ వైపు మొగ్గుతుంది. ఈ గాలి కోరియోలిస్ ఎఫెక్ట్ మూలంగా ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశ వైపు, దక్షిణార్ధగోళంలో వాయువ్యం వైపు కదులుతుంది. దీనికి అధిక పీడనమూ తోడై భూమధ్యరేఖకు రెండు వైపులా గాలులు తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. వీటినే వాణిజ్య గాలులు (ట్రేడ్ విండ్స్) అంటారు. ఒకప్పుడు నావికులు పసిఫిక్ మహా సముద్రం గుండా తేలికగా ప్రయాణాలు చేయటానికి వీటిని వాడుకునేవారు. వాణిజ్య గాలుల బలాన్ని బట్టి మహా సముద్ర ఉపరితలం చల్లబడటం, వేడెక్కటం ఒక వలయంలా సాగుతుంది. సాధారణంగా పసిఫిక్ మహా సముద్రంలో వాణిజ్య గాలులు భూమధ్యరేఖ వద్ద తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. ఇవి దక్షిణ అమెరికా తీర ప్రాంతం నుంచి వేడి నీటిని ఆసియా దిశకు లాక్కొస్తాయి. ఈ వేడి నీటిని భర్తీ చేయటానికి సముద్రపు లోతుల్లోంచి చల్లటి నీరు పైకి వస్తుంది (అప్వెలింగ్). ఈ చల్లటి నీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితం మీదుండే పైటోఫ్లాంక్టన్కు ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిని చేపలు తిని, వృద్ధి చెందుతాయి. అయితే వాణిజ్య గాలులు బలహీనపడ్డప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గటం వల్ల ఉపరితల వేడి జలాలను పడమర వైపునకు బలంగా నెట్టలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు వేడి నీరు భూమధ్యరేఖ వద్దే పోగుపడుతూ వస్తుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. గాలి కూడా వేడెక్కుతుంది. అలాగే తూర్పు వైపున చల్లటి నీరు పైకి రావటమూ తగ్గుతుంది. దీంతో చల్లగా ఉండాల్సిన మహాసముద్ర భాగాలు వేడెక్కుతాయి. ఇదే ఎల్నినో. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు- వేడి సముద్ర ఉపరితలం, కింద చల్లటి నీటి మధ్య ఉండే లోతూ తగ్గుతుంది (థర్మోక్లైన్). దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం తీరుతెన్నులు గణనీయంగా మారిపోతాయి. వరదలు, కరవులు, క్షామం, సముద్రజీవుల మూకుమ్మడి మరణాల వంటి వాటికి దారితీస్తుంది. పెరూ వంటి దేశాల్లో కుంభవృష్టి, వరదలు పెరిగితే.. భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరవు, క్షామం సంభవిస్తాయి. అంటే ప్రపంచంలో ఏ ప్రాంతమైనా వాతావరణ ప్రభావంతోనో, సామాజిక-ఆర్థిక పరంగానో నేరుగా ఎల్నినో ప్రభావానికి గురికావాల్సిందేనన్నమాట. బలమైన ఎల్నినో తొలి సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయని అమెరికా-యూరప్ ఉపగ్రహం సెంటినెల్-6 మైఖేల్ ఫ్రీలిచ్ ఇటీవల గుర్తించింది. సముద్ర ఉపరితలం మీద వేలాది మైళ్ల విస్తీర్ణంలో 2-4 అంగుళాల ఎత్తుతో వాణిజ్య అలలు ఎగుస్తున్నాయని పసిగట్టింది. ఇవి 2023లో ఎల్నినో రావచ్చొని గట్టిగా చెబుతున్నాయి. ఓషియానిక్ నైనో ఇండెక్స్ (ఓఎన్ఐ) ఆధారంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో తేడాలను లెక్కిస్తారు. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా నమోదైతే ఎల్నినోకు సంకేతంగా భావిస్తారు.
బాల ఏసు పేరిట
పసిఫిక్ మహా సముద్రంలో వేడి నీటి తీరుతెన్నులను తొలిసారిగా 17వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్ తీరప్రాంత జాలరులు గమనించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు ‘ఎల్నినో డి లా నేవిడాడ్’. అంటే ‘ద క్రిస్మస్ చైల్డ్’.. అంటే బాల ఏసు అని అర్థం. ఇక 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణమేంటనేది తెలుసుకోవటం మీద దృష్టి సారించారు. చివరికివి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని, ఎల్నినో ప్రభావంతోనే ఏర్పడు తున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. దీన్నే సదరన్ ఆసిలేషన్ అనీ అంటారు. ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందనీ తెలుసుకున్నారు. అయితే ఇదేమీ కచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు రెండేళ్లకూ, మరికొన్ని సార్లు 7 సంవత్సరాలకూ ఏర్పడొచ్చు. సాధారణంగా ఇది 9-12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ ఉండొచ్చు.
ఏం జరుగుతుంది?
ఎల్నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్నినో విభిన్నమైందే. ఒకోటీ ఒకోలా ప్రభావం చూపుతుంది. ఎల్నినోతో వరదలు, కరవులు సంభవించడమే కాదు.. వాతావరణం వేడెక్కటం మరో సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కటం వల్ల వాతా వరణంలోకి పెద్దమొత్తంలో శక్తి విడుదలవుతంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలూ పెరుగు తాయి. ఎల్నినో సమయంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవటానికి కారణమిదే. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే.
* ఎల్నినో ఏర్పడినప్పుడు పగడపు దీవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 1998లో ఏర్పడిన ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 16% పగడపు దీవులు నశించాయని అంచనా. 2015-16లో వచ్చిన ఎల్నినో సమయంలో ప్రపంచవ్యాప్తంగా 75-99% పగడాలు నశించాయి. ఎల్నినోతో కార్చిచ్చులు చెలరేగటమూ ఎక్కువవుతుంది.
మనదేశంపై ప్రభావమేంటి?
మహా సముద్రాలు వేడెక్కటం వల్ల ఉపఖండం మీద నైరుతి రుతు పవనాల కదలికలు మందగించొచ్చు. ఫలితంగా వర్షాలు పడటం తగ్గుతుంది. మనదేశంలో 2023లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. జూన్-సెప్టెంబర్ కాలంలో ఎల్నినో వాతావరణం 90% వరకు ఏర్పడొచ్చని పేర్కొంది. వర్షపాతం తక్కువగా ఉండొచ్చనే ఇది సూచిస్తోంది. గతంలో ఎల్నినో ఏర్పడిన సంవత్సరాల్లో వర్షపాతం సగటు కన్నా తక్కువ నమోదవటం గమనార్హం.
* ఎల్నినో ఏర్పడినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో పంటలకు నష్టం కలిగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.
* మనదేశంలో 2001-2020 మధ్యకాలంలో తొమ్మిది ఎల్నినో సంవత్సరాలను ఎదుర్కొంది. వీటిల్లో నాలుగు ఎల్నినో సంవత్సరాల్లో కరవు ఏర్పడింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90% తక్కువగా వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరాల్లో ఖరీఫ్లో పంట దిగుబడి 16%, 8%, 10%, 3% చొప్పున తగ్గాయి. ద్రవ్యోల్బణానికి దారితీశాయి. మనదేశ వార్షిక ఆహార సరఫరాలో సుమారు సగం వాటా ఖరీఫ్ కాలంలోనే పండిన పంటలదే.
వ్యతిరేకం లానినా
సాధారణంగా క్రిస్మస్ సమయంలో ఎల్నినో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. కొద్ది నెలల పాటు కొనసాగుతూ వస్తుంది. తర్వాత వెనక్కి మళ్లుతుంది. ఈ క్రమంలో ఎల్నినోకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదే లానినా. అంటే స్పానిష్లో బాలిక అని అర్థం. ఈ సమయంలో వాణిజ్య గాలులు బలం పుంజుకొని, వేడి నీటిని పడమర వైపునకు బాగా నెట్టేస్తాయి. దీంతో తూర్పు వైపున చల్లటి నీరు పైకి ఉబికి వస్తుంది. ఇది ఎల్నినోకు పూర్తి విభిన్నం. అందుకే దీన్ని యాంటీ- ఎల్నినో అనీ పిలుచుకుంటారు. ఇదీ వాతావరణం మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతుంది. సాధారణంగా లానినా కన్నా ఎల్నినో తరచూ ఏర్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్