El Nino: ఎల్నినో కథ
ఎల్నినో. పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ కాలేజ్ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం.
ఎల్నినో. పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ కాలేజ్ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.281 లక్షల కోట్ల నష్టం సంభవించొచ్చనీ పేర్కొంటోంది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఎల్నినో అంటే ఏంటి? ఎందుకొస్తుంది?
పగలు, రాత్రి.. రోజులు దొర్లుతుంటాయి. ఎండ, వాన, చలి.. కాలాలు, రుతువులు మారుతుంటాయి. అన్నీ ఒక వలయంగా వస్తూ, పోతుంటాయి. భూమ్మీద జీవనం వీటి మీదే ఆధారపడి నడుస్తుంది. ఇలాంటి మార్పులు చాలావరకు కొద్ది వ్యవధులకే పరిమితమవుతుంటాయి. వీటిని కచ్చితంగా అంచనా వేయొచ్చు. రాత్రి ఎప్పుడవుతుందో, ఉదయం ఎప్పుడు మొదలవుతుందో చెప్పొచ్చు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎప్పుడొస్తాయో, ఎప్పుడు ముగుస్తాయో ముందే అవగతమైపోతుంది. అయితే మంచుయుగం వంటి కొన్ని మార్పుల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని అంచనా వేయటం అంత తేలిక కాదు. కానీ వాతావరణం, జీవజాతుల మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పులతో సంభవించే ఎల్నినో అలాంటిదే.
సముద్రాలు వాతావరణం
మహా సముద్రాలు, వాతావారణానికి మధ్య విడదీయరాని సంబంధముంది. పసిఫిక్ మహా సముద్రం విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్నినో పుట్టేదే ఇక్కడే మరి. భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన అటూఇటూ సుమారు 30 డిగ్రీల మధ్య ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలంటారు. భూభ్రమణం మూలంగా ఇక్కడ గాలి భూమధ్యరేఖ వైపు మొగ్గుతుంది. ఈ గాలి కోరియోలిస్ ఎఫెక్ట్ మూలంగా ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశ వైపు, దక్షిణార్ధగోళంలో వాయువ్యం వైపు కదులుతుంది. దీనికి అధిక పీడనమూ తోడై భూమధ్యరేఖకు రెండు వైపులా గాలులు తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. వీటినే వాణిజ్య గాలులు (ట్రేడ్ విండ్స్) అంటారు. ఒకప్పుడు నావికులు పసిఫిక్ మహా సముద్రం గుండా తేలికగా ప్రయాణాలు చేయటానికి వీటిని వాడుకునేవారు. వాణిజ్య గాలుల బలాన్ని బట్టి మహా సముద్ర ఉపరితలం చల్లబడటం, వేడెక్కటం ఒక వలయంలా సాగుతుంది. సాధారణంగా పసిఫిక్ మహా సముద్రంలో వాణిజ్య గాలులు భూమధ్యరేఖ వద్ద తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. ఇవి దక్షిణ అమెరికా తీర ప్రాంతం నుంచి వేడి నీటిని ఆసియా దిశకు లాక్కొస్తాయి. ఈ వేడి నీటిని భర్తీ చేయటానికి సముద్రపు లోతుల్లోంచి చల్లటి నీరు పైకి వస్తుంది (అప్వెలింగ్). ఈ చల్లటి నీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితం మీదుండే పైటోఫ్లాంక్టన్కు ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిని చేపలు తిని, వృద్ధి చెందుతాయి. అయితే వాణిజ్య గాలులు బలహీనపడ్డప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గటం వల్ల ఉపరితల వేడి జలాలను పడమర వైపునకు బలంగా నెట్టలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు వేడి నీరు భూమధ్యరేఖ వద్దే పోగుపడుతూ వస్తుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. గాలి కూడా వేడెక్కుతుంది. అలాగే తూర్పు వైపున చల్లటి నీరు పైకి రావటమూ తగ్గుతుంది. దీంతో చల్లగా ఉండాల్సిన మహాసముద్ర భాగాలు వేడెక్కుతాయి. ఇదే ఎల్నినో. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు- వేడి సముద్ర ఉపరితలం, కింద చల్లటి నీటి మధ్య ఉండే లోతూ తగ్గుతుంది (థర్మోక్లైన్). దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం తీరుతెన్నులు గణనీయంగా మారిపోతాయి. వరదలు, కరవులు, క్షామం, సముద్రజీవుల మూకుమ్మడి మరణాల వంటి వాటికి దారితీస్తుంది. పెరూ వంటి దేశాల్లో కుంభవృష్టి, వరదలు పెరిగితే.. భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరవు, క్షామం సంభవిస్తాయి. అంటే ప్రపంచంలో ఏ ప్రాంతమైనా వాతావరణ ప్రభావంతోనో, సామాజిక-ఆర్థిక పరంగానో నేరుగా ఎల్నినో ప్రభావానికి గురికావాల్సిందేనన్నమాట. బలమైన ఎల్నినో తొలి సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయని అమెరికా-యూరప్ ఉపగ్రహం సెంటినెల్-6 మైఖేల్ ఫ్రీలిచ్ ఇటీవల గుర్తించింది. సముద్ర ఉపరితలం మీద వేలాది మైళ్ల విస్తీర్ణంలో 2-4 అంగుళాల ఎత్తుతో వాణిజ్య అలలు ఎగుస్తున్నాయని పసిగట్టింది. ఇవి 2023లో ఎల్నినో రావచ్చొని గట్టిగా చెబుతున్నాయి. ఓషియానిక్ నైనో ఇండెక్స్ (ఓఎన్ఐ) ఆధారంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో తేడాలను లెక్కిస్తారు. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా నమోదైతే ఎల్నినోకు సంకేతంగా భావిస్తారు.
బాల ఏసు పేరిట
పసిఫిక్ మహా సముద్రంలో వేడి నీటి తీరుతెన్నులను తొలిసారిగా 17వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్ తీరప్రాంత జాలరులు గమనించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు ‘ఎల్నినో డి లా నేవిడాడ్’. అంటే ‘ద క్రిస్మస్ చైల్డ్’.. అంటే బాల ఏసు అని అర్థం. ఇక 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణమేంటనేది తెలుసుకోవటం మీద దృష్టి సారించారు. చివరికివి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని, ఎల్నినో ప్రభావంతోనే ఏర్పడు తున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. దీన్నే సదరన్ ఆసిలేషన్ అనీ అంటారు. ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందనీ తెలుసుకున్నారు. అయితే ఇదేమీ కచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు రెండేళ్లకూ, మరికొన్ని సార్లు 7 సంవత్సరాలకూ ఏర్పడొచ్చు. సాధారణంగా ఇది 9-12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ ఉండొచ్చు.
ఏం జరుగుతుంది?
ఎల్నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్నినో విభిన్నమైందే. ఒకోటీ ఒకోలా ప్రభావం చూపుతుంది. ఎల్నినోతో వరదలు, కరవులు సంభవించడమే కాదు.. వాతావరణం వేడెక్కటం మరో సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కటం వల్ల వాతా వరణంలోకి పెద్దమొత్తంలో శక్తి విడుదలవుతంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలూ పెరుగు తాయి. ఎల్నినో సమయంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవటానికి కారణమిదే. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే.
* ఎల్నినో ఏర్పడినప్పుడు పగడపు దీవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 1998లో ఏర్పడిన ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 16% పగడపు దీవులు నశించాయని అంచనా. 2015-16లో వచ్చిన ఎల్నినో సమయంలో ప్రపంచవ్యాప్తంగా 75-99% పగడాలు నశించాయి. ఎల్నినోతో కార్చిచ్చులు చెలరేగటమూ ఎక్కువవుతుంది.
మనదేశంపై ప్రభావమేంటి?
మహా సముద్రాలు వేడెక్కటం వల్ల ఉపఖండం మీద నైరుతి రుతు పవనాల కదలికలు మందగించొచ్చు. ఫలితంగా వర్షాలు పడటం తగ్గుతుంది. మనదేశంలో 2023లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. జూన్-సెప్టెంబర్ కాలంలో ఎల్నినో వాతావరణం 90% వరకు ఏర్పడొచ్చని పేర్కొంది. వర్షపాతం తక్కువగా ఉండొచ్చనే ఇది సూచిస్తోంది. గతంలో ఎల్నినో ఏర్పడిన సంవత్సరాల్లో వర్షపాతం సగటు కన్నా తక్కువ నమోదవటం గమనార్హం.
* ఎల్నినో ఏర్పడినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో పంటలకు నష్టం కలిగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.
* మనదేశంలో 2001-2020 మధ్యకాలంలో తొమ్మిది ఎల్నినో సంవత్సరాలను ఎదుర్కొంది. వీటిల్లో నాలుగు ఎల్నినో సంవత్సరాల్లో కరవు ఏర్పడింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90% తక్కువగా వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరాల్లో ఖరీఫ్లో పంట దిగుబడి 16%, 8%, 10%, 3% చొప్పున తగ్గాయి. ద్రవ్యోల్బణానికి దారితీశాయి. మనదేశ వార్షిక ఆహార సరఫరాలో సుమారు సగం వాటా ఖరీఫ్ కాలంలోనే పండిన పంటలదే.
వ్యతిరేకం లానినా
సాధారణంగా క్రిస్మస్ సమయంలో ఎల్నినో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. కొద్ది నెలల పాటు కొనసాగుతూ వస్తుంది. తర్వాత వెనక్కి మళ్లుతుంది. ఈ క్రమంలో ఎల్నినోకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదే లానినా. అంటే స్పానిష్లో బాలిక అని అర్థం. ఈ సమయంలో వాణిజ్య గాలులు బలం పుంజుకొని, వేడి నీటిని పడమర వైపునకు బాగా నెట్టేస్తాయి. దీంతో తూర్పు వైపున చల్లటి నీరు పైకి ఉబికి వస్తుంది. ఇది ఎల్నినోకు పూర్తి విభిన్నం. అందుకే దీన్ని యాంటీ- ఎల్నినో అనీ పిలుచుకుంటారు. ఇదీ వాతావరణం మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతుంది. సాధారణంగా లానినా కన్నా ఎల్నినో తరచూ ఏర్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు