‘ఆరో’ప్రాణమయ్యారు
రోడ్డుప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి ఆరుగురికి అవయవదానం చేశారు. ప్రాణాపాయస్థితితో కొట్టుమిట్టాడుతున్న పలువురికి పునర్జన్మనిచ్చారు. ఆరిపోతున్న జీవితాలకు ఆరో ప్రాణమయ్యారు. బానోత్ శ్రీను నిర్జీవుడైనా
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన యువకుని నుంచి అవయవాల సేకరణ
భార్య, పిల్లలతో బానోత్ శ్రీను
మణుగూరు సాంస్కృతికం, న్యూస్టుడే: రోడ్డుప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి ఆరుగురికి అవయవదానం చేశారు. ప్రాణాపాయస్థితితో కొట్టుమిట్టాడుతున్న పలువురికి పునర్జన్మనిచ్చారు. ఆరిపోతున్న జీవితాలకు ఆరో ప్రాణమయ్యారు. బానోత్ శ్రీను నిర్జీవుడైనా ఆయన అవయవాలు కొందరికి ఊపిరిపోసి కొత్త జీవితాన్నిచ్చాయి. కుటుంబసభ్యుల సన్నద్ధత, నిపుణులైన వైద్యుల సత్వర స్పందన, ఆసుపత్రి యంత్రాంగం చేసిన చురుకైన ఏర్పాట్లు.. వెరసి బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవదాన ప్రక్రియ విజయవంతమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సమితిసింగారం పంచాయతీకి చెందిన బానోత్ శ్రీను(33) స్థానిక దుర్గ ఆఫ్లోడింగ్ కంపెనీలో విధులు నిర్వహించేవాడు. ఆయనకు భార్య పావని, కుమారుడు ఛత్రపతి, కుమార్తె నవ్యశ్రీ ఉన్నారు. శ్రీను ఈ నెల 22న విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా కూనవరం రైల్వేగేటు దగ్గర తన ద్విచక్రవాహనం ప్రమాదానికి గురవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. మూడు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్డెడ్ అయినట్లు బుధవారం ఉదయం నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్దాన్ వైద్య బృందం అవయవ దానంపై శ్రీను కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో అతని రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కంటి కార్నియాలు సేకరించి.. శస్త్ర చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చినట్లు జీవన్దాన్ ఇన్ఛార్జి స్వర్ణలత వెల్లడించారు. కన్న కొడుకు చనిపోయాడన్న బాధను దిగమింగుకొని ఆ తల్లిదండ్రులు తమ కొడుకు అవయవాలను ఇతరులకు దానం చేసిన వారి ఔన్నత్యాన్ని పలువురు అభినందించారు. తనతో ఏడడుగులు వేసిన భర్తకు చెందిన అవయవాలను ఆరుగురికి ఇచ్చేందుకు అంగీకరించిన పావని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు.
* ఓబీ కార్మికులు శ్రీను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించి, కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపి, సంతాపం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.