logo

జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్‌.బి.నగర్‌ కోర్టుకు బదిలీ అయ్యారు.

Published : 26 Apr 2024 02:53 IST

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్‌.బి.నగర్‌ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఖమ్మం మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న కె.దీపను నియమించారు. ఖమ్మం మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బి.రజనీ, ఖమ్మం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జడ్జిగా బక్కెర నాగలక్ష్మిని నియమించారు. మణుగూరు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న ఎం.వెంకటేశ్వర్లు భద్రాచలం కోర్టుకు, అక్కడ పని చేస్తున్న కె.సూరిరెడ్డి మణుగూరుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని