Telangana News: కేటీఆర్ వ్యాఖ్యలపై ఉలికిపాటు ఎందుకు?: తలసాని
పక్క రాష్ట్రంలో కరెంట్ లేదంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్లోనే కరెంట్ లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్: పక్క రాష్ట్రంలో కరెంట్ లేదంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్లోనే కరెంట్ లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పందించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్లో కరెంట్ లేదనడంలో అర్థం లేదని మండిపడ్డారు. కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారని నిలదీశారు. ఏపీ నేతలు తొందరపాటు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోతలు లేని విద్యుత్, మౌలిక వసతుల కల్పన వల్లే నగరానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని తలసాని వివరించారు.
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి పుట్టించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై పోటాపోటీగా విమర్శలు గుప్పించుకున్నారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని, జగన్ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని కేటీఆర్ అర్ధరాత్రి సమయంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.