Lata Mangeshkar: వసంతాలు వెదుకుతాయి నీవెక్కడని..!
ఏడు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్ (92) కన్నుమూశారు. స్వల్పంగా కొవిడ్-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేరిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం...
భారతరత్న లతా మంగేష్కర్ ఇక లేరు
గానకోకిలను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి
28 రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూత
7 దశాబ్దాలపాటు గానంతో ఓలలాడించిన మధుర స్వరం మూగబోవడంతో కన్నీటి సంద్రంలో అభిమానులు
ముంబయి
‘‘హమారే బాద్ అబ్ మెహఫిల్ మే, అఫ్సానే బయా హోంగే
బహారే హమ్ కో ఢూండేగీ, నా జానే హమ్ కహా హోంగే!’’
(నా తదనంతరం.. నలుగురూ చేరినచోట చర్చలు జరుగుతాయి
వసంతాలు వెదుకుతాయి నేనెక్కడని, ఎక్కడుంటానో తెలియదుగా!)
సినీ వసంతంలో కాలు మోపిన తొలిరోజుల్లో ‘బాగీ’ (1953) చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన గీతమిది. ఆ గీతం నేడు అక్షరసత్యమై.. ప్రతి హృదిలో ప్రతిధ్వనిస్తోంది. దివికేగిన ఆ గాన కోకిలను యావద్దేశం గుర్తు చేసుకుంటోంది. భారమైన హృదయంతో నలుదిక్కులా చూస్తోంది. ఎటు వెళ్లిపోయింది లతా మంగేష్కర్? బహుశా.. గంధర్వలోక స్వాగత సత్కారాలు అందుకొంటూ ఉందేమో! తనకంటే ముందే అక్కడ చేరిన ముకేశ్, మహమ్మద్ రఫీ, కిశోర్కుమార్ వంటి సమకాలీన గాయక దిగ్గజాలతో కుశల ప్రశ్నల్లో నిమగ్నమై ఉన్నారేమో!!
ఏడు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్ (92) కన్నుమూశారు. స్వల్పంగా కొవిడ్-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేరిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో వెంటిలేటర్ను తొలగించారు. తర్వాత క్రమేపీ పరిస్థితి విషమించింది. శనివారం నుంచి అత్యంత విషమంగా మారింది. కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఆదివారం ఉదయం 8.12 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు వెల్లడించారు. అధికారిక లాంఛనాల నడుమ ఆదివారం సాయంత్రం దాదర్లోని శివాజీపార్క్ వద్ద నిర్వహించిన మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్ సహా పలువురు హాజరయ్యారు. పోలీసులు, సైనికులు ఆమెకు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనం చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారకానికి 100 మీటర్ల దూరంలో గాన కోకిలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారంలో 25 కిలోల గంధపు చెక్కల్ని వినియోగించారు. చితికి లత సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ నిప్పంటించారు. పది కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమ యాత్రలో రహదారికి ఇరువైపులా వేలమంది నిల్చొని అశ్రు నివాళులు అర్పించారు. అభిమాన గాయనిని కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తారు. పూలరథంలో త్రివర్ణ పతాకం చుట్టిన శవపేటికలో భౌతిక కాయాన్ని అంతిమ యాత్రకు తీసుకువెళ్లారు. లతకు నివాళి అర్పించినవారిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్; అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, జావేద్ అఖ్తర్, సంజయ్లీలా భన్సాలీ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1929 సెప్టెంబరు 28న జన్మించిన మంగేష్కర్కు మీనా, ఆశాభోంస్లే, ఉష, హృదయనాథ్లు తోబుట్టువులు. శాస్త్రీయ సంగీతకారుడైన తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత.. ఐదో ఏట నుంచే పాడడం మొదలుపెట్టారు. తండ్రి మరణానంతరం నటనా రంగంలో ఆమె అడుగుపెట్టినా పాటల ప్రస్థానాన్ని మాత్రం కొనసాగించారు. మొట్టమొదటగా ఓ మరాఠీ చిత్రంతో ఆమె నేపథ్య గాయని అయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. చివరిసారిగా ఆమె ఆలపించిన పాట గత అక్టోబరులో విడుదలైంది. ‘చల్తే చల్తే’, ‘సత్యం శివం సుందరం’, ‘ప్యార్ కియాతో డర్నా క్యా’, ‘లగ్ జా గలే’ వంటి ఎన్నో చిరస్మరణీయ గీతాలు ఆమె గాత్రం నుంచి జాలువారాయి. ఆమెను వరించని పురస్కారం లేదు. 1999-2005 మధ్య ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. కళాకారుల కోటాలో కేంద్ర ప్రభుత్వం ఆమెను నియమించింది. భారతరత్నకు అదనంగా పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో పాటు జాతీయ చలన చిత్రోత్సవాల్లో అనేక అవార్డులను ఆమె పొందారు. ఆమె గాత్ర మాధుర్యంతో పులకించిన అనేకమంది లతను సరస్వతీ దేవితో పోలుస్తుంటారు. సరిగ్గా సరస్వతీ పూజ మరుసటిరోజే ఆమె తనువు చాలించడాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు.
మధుర గాయని కన్నుమూతపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సహా అనేకమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున సంతాపాలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆది, సోమవారాల్లో దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు, మధ్యప్రదేశ్/ కర్ణాటక వంటి రాష్ట్రాలు రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించాయి.
దివ్యగళం మూగబోయింది..
- రామ్నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతి
ఇటువంటి కళాకారులు కొన్ని శతాబ్దాలకు ఒకరు పుడుతుంటారు. దివ్యమైన ఆ గళం మూగబోయింది. లతా మంగేష్కర్ పాడిన మధురగీతాలు అజరామరం. ఆ పాటలు మన మధ్య ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. భారతీయ ఔన్నత్యం, సౌందర్యం వాటిలో తొంగి చూస్తాయి. కొన్ని తరాలు ఆమె పాటలతో స్ఫూర్తి పొందుతాయి. ‘భారతరత్న’ లతాజీ విజయాలు అనితరసాధ్యం.
లతాజీ సంగీతరత్నం..
- ఎం.వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి
లతాజీ మరణంతో భారతదేశం గొంతు మూగబోయింది. తన గళమాధుర్యంతో ఆమె కొన్ని దశాబ్దాలు భారత్తోపాటు ప్రపంచ సంగీత అభిమానులను అలరించారు. ఆమె సంగీతరత్న. హిందీ సినీ సామ్రాజ్యాన్ని రాణిలా ఏలారు. భారమైన హృదయంతో లతాజీ కుటుంబసభ్యులకు, ఆమె అభిమానులకు సంతాపం తెలుపుతున్నా.
మాటలు రావడం లేదు..
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
జాతికి ఇక ఆమె లేరన్న లోటును ఎవరూ పూడ్చలేరు. లతా దీదీ దయ, ప్రేమాభిమానాలు తలచుకుంటే బాధతో మాటలు రావడం లేదు. భారత సంస్కృతికి దిగ్గజ ప్రతీకగా ఆమెను ముందు తరాలు గుర్తు పెట్టుకుంటాయి. మధురమైన ఆ కంఠానికి ప్రజలను మైమరిపింపజేసే అసమాన సామర్థ్యం ఉంది. సినిమాలే కాకుండా.. ఈ దేశ ఉన్నతిని ఆమె సదా కోరుకున్నారు.
* ఉపఖండం ప్రపంచస్థాయి గొప్ప గాయకురాలిని కోల్పోయింది.
- ఇమ్రాన్ఖాన్, పాక్ ప్రధాని
* సంగీత మహారాణికి నివాళులు. ఉపఖండంలోని సంగీత ప్రియులకు ఇది తీరని లోటు
- షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని
* పాటల రూపంలో లతా ఎప్పటికీ మనతో ఉంటారు.
- మహీంద్రా రాజపక్స, శ్రీలంక ప్రధాని
సంగీతానికి దేవుడిచ్చిన వరం
సీఎం కేసీఆర్ సంతాపం
ఈనాడు, హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ‘‘లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం. వేల పాటలు పాడిన ఆమె సరస్వతీ స్వరనిధి. లతాజీ వల్ల పురస్కారాలకు గౌరవం దక్కింది’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు సంతాపం తెలిపారు.
గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి: లతా మంగేష్కర్ మృతిపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త విని బాధపడ్డానని ఆదివారం ట్విటర్లో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సంతాపం
లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె అద్భుతమైన గానంతో వివిధ భాషల్లో వేలాది పాటలు పాడారన్నారు. ఇందులో తెలుగులో పాడిన మూడు పాటలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇంకా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.