Lata Mangeshkar: వసంతాలు వెదుకుతాయి నీవెక్కడని..!
ఏడు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్ (92) కన్నుమూశారు. స్వల్పంగా కొవిడ్-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేరిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం...
భారతరత్న లతా మంగేష్కర్ ఇక లేరు
గానకోకిలను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి
28 రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూత
7 దశాబ్దాలపాటు గానంతో ఓలలాడించిన మధుర స్వరం మూగబోవడంతో కన్నీటి సంద్రంలో అభిమానులు
ముంబయి
‘‘హమారే బాద్ అబ్ మెహఫిల్ మే, అఫ్సానే బయా హోంగే
బహారే హమ్ కో ఢూండేగీ, నా జానే హమ్ కహా హోంగే!’’
(నా తదనంతరం.. నలుగురూ చేరినచోట చర్చలు జరుగుతాయి
వసంతాలు వెదుకుతాయి నేనెక్కడని, ఎక్కడుంటానో తెలియదుగా!)
సినీ వసంతంలో కాలు మోపిన తొలిరోజుల్లో ‘బాగీ’ (1953) చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన గీతమిది. ఆ గీతం నేడు అక్షరసత్యమై.. ప్రతి హృదిలో ప్రతిధ్వనిస్తోంది. దివికేగిన ఆ గాన కోకిలను యావద్దేశం గుర్తు చేసుకుంటోంది. భారమైన హృదయంతో నలుదిక్కులా చూస్తోంది. ఎటు వెళ్లిపోయింది లతా మంగేష్కర్? బహుశా.. గంధర్వలోక స్వాగత సత్కారాలు అందుకొంటూ ఉందేమో! తనకంటే ముందే అక్కడ చేరిన ముకేశ్, మహమ్మద్ రఫీ, కిశోర్కుమార్ వంటి సమకాలీన గాయక దిగ్గజాలతో కుశల ప్రశ్నల్లో నిమగ్నమై ఉన్నారేమో!!
ఏడు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్ (92) కన్నుమూశారు. స్వల్పంగా కొవిడ్-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేరిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో వెంటిలేటర్ను తొలగించారు. తర్వాత క్రమేపీ పరిస్థితి విషమించింది. శనివారం నుంచి అత్యంత విషమంగా మారింది. కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఆదివారం ఉదయం 8.12 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు వెల్లడించారు. అధికారిక లాంఛనాల నడుమ ఆదివారం సాయంత్రం దాదర్లోని శివాజీపార్క్ వద్ద నిర్వహించిన మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్ సహా పలువురు హాజరయ్యారు. పోలీసులు, సైనికులు ఆమెకు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనం చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారకానికి 100 మీటర్ల దూరంలో గాన కోకిలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారంలో 25 కిలోల గంధపు చెక్కల్ని వినియోగించారు. చితికి లత సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ నిప్పంటించారు. పది కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమ యాత్రలో రహదారికి ఇరువైపులా వేలమంది నిల్చొని అశ్రు నివాళులు అర్పించారు. అభిమాన గాయనిని కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తారు. పూలరథంలో త్రివర్ణ పతాకం చుట్టిన శవపేటికలో భౌతిక కాయాన్ని అంతిమ యాత్రకు తీసుకువెళ్లారు. లతకు నివాళి అర్పించినవారిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్; అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, జావేద్ అఖ్తర్, సంజయ్లీలా భన్సాలీ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1929 సెప్టెంబరు 28న జన్మించిన మంగేష్కర్కు మీనా, ఆశాభోంస్లే, ఉష, హృదయనాథ్లు తోబుట్టువులు. శాస్త్రీయ సంగీతకారుడైన తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత.. ఐదో ఏట నుంచే పాడడం మొదలుపెట్టారు. తండ్రి మరణానంతరం నటనా రంగంలో ఆమె అడుగుపెట్టినా పాటల ప్రస్థానాన్ని మాత్రం కొనసాగించారు. మొట్టమొదటగా ఓ మరాఠీ చిత్రంతో ఆమె నేపథ్య గాయని అయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. చివరిసారిగా ఆమె ఆలపించిన పాట గత అక్టోబరులో విడుదలైంది. ‘చల్తే చల్తే’, ‘సత్యం శివం సుందరం’, ‘ప్యార్ కియాతో డర్నా క్యా’, ‘లగ్ జా గలే’ వంటి ఎన్నో చిరస్మరణీయ గీతాలు ఆమె గాత్రం నుంచి జాలువారాయి. ఆమెను వరించని పురస్కారం లేదు. 1999-2005 మధ్య ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. కళాకారుల కోటాలో కేంద్ర ప్రభుత్వం ఆమెను నియమించింది. భారతరత్నకు అదనంగా పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో పాటు జాతీయ చలన చిత్రోత్సవాల్లో అనేక అవార్డులను ఆమె పొందారు. ఆమె గాత్ర మాధుర్యంతో పులకించిన అనేకమంది లతను సరస్వతీ దేవితో పోలుస్తుంటారు. సరిగ్గా సరస్వతీ పూజ మరుసటిరోజే ఆమె తనువు చాలించడాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు.
మధుర గాయని కన్నుమూతపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సహా అనేకమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున సంతాపాలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆది, సోమవారాల్లో దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు, మధ్యప్రదేశ్/ కర్ణాటక వంటి రాష్ట్రాలు రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించాయి.
దివ్యగళం మూగబోయింది..
- రామ్నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతి
ఇటువంటి కళాకారులు కొన్ని శతాబ్దాలకు ఒకరు పుడుతుంటారు. దివ్యమైన ఆ గళం మూగబోయింది. లతా మంగేష్కర్ పాడిన మధురగీతాలు అజరామరం. ఆ పాటలు మన మధ్య ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. భారతీయ ఔన్నత్యం, సౌందర్యం వాటిలో తొంగి చూస్తాయి. కొన్ని తరాలు ఆమె పాటలతో స్ఫూర్తి పొందుతాయి. ‘భారతరత్న’ లతాజీ విజయాలు అనితరసాధ్యం.
లతాజీ సంగీతరత్నం..
- ఎం.వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి
లతాజీ మరణంతో భారతదేశం గొంతు మూగబోయింది. తన గళమాధుర్యంతో ఆమె కొన్ని దశాబ్దాలు భారత్తోపాటు ప్రపంచ సంగీత అభిమానులను అలరించారు. ఆమె సంగీతరత్న. హిందీ సినీ సామ్రాజ్యాన్ని రాణిలా ఏలారు. భారమైన హృదయంతో లతాజీ కుటుంబసభ్యులకు, ఆమె అభిమానులకు సంతాపం తెలుపుతున్నా.
మాటలు రావడం లేదు..
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
జాతికి ఇక ఆమె లేరన్న లోటును ఎవరూ పూడ్చలేరు. లతా దీదీ దయ, ప్రేమాభిమానాలు తలచుకుంటే బాధతో మాటలు రావడం లేదు. భారత సంస్కృతికి దిగ్గజ ప్రతీకగా ఆమెను ముందు తరాలు గుర్తు పెట్టుకుంటాయి. మధురమైన ఆ కంఠానికి ప్రజలను మైమరిపింపజేసే అసమాన సామర్థ్యం ఉంది. సినిమాలే కాకుండా.. ఈ దేశ ఉన్నతిని ఆమె సదా కోరుకున్నారు.
* ఉపఖండం ప్రపంచస్థాయి గొప్ప గాయకురాలిని కోల్పోయింది.
- ఇమ్రాన్ఖాన్, పాక్ ప్రధాని
* సంగీత మహారాణికి నివాళులు. ఉపఖండంలోని సంగీత ప్రియులకు ఇది తీరని లోటు
- షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని
* పాటల రూపంలో లతా ఎప్పటికీ మనతో ఉంటారు.
- మహీంద్రా రాజపక్స, శ్రీలంక ప్రధాని
సంగీతానికి దేవుడిచ్చిన వరం
సీఎం కేసీఆర్ సంతాపం
ఈనాడు, హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ‘‘లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం. వేల పాటలు పాడిన ఆమె సరస్వతీ స్వరనిధి. లతాజీ వల్ల పురస్కారాలకు గౌరవం దక్కింది’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు సంతాపం తెలిపారు.
గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి: లతా మంగేష్కర్ మృతిపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త విని బాధపడ్డానని ఆదివారం ట్విటర్లో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సంతాపం
లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె అద్భుతమైన గానంతో వివిధ భాషల్లో వేలాది పాటలు పాడారన్నారు. ఇందులో తెలుగులో పాడిన మూడు పాటలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇంకా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!